AP High Court: ఆంధ్రప్రదేశ్ లో పలువురు దిగువ స్థాయి నుండి ఐఏఎస్ ల వరకూ కోర్టు దిక్కరణ కేసులు ఎదుర్కోవడం, శిక్షలు పడుతుండటం పరిపాటి అయ్యింది. తాజాగా ఓ మున్సిపల్ కమిషన్ కు కూడా కోర్టు దిక్కరణ కేసులో శిక్ష విధించింది హైకోర్టు. కోర్టు ఆదేశాలు పాటించని కారణంగా గుంటూరు మున్సిపల్ కమిషనర్ కీర్తికి ఏపీ హైకోర్టు జైలు శిక్ష విధించింది.
గుంటూరు కార్పోరేషన్ పరిధిలోని యడవలి వారి సత్రాన్ని అక్రమంగా ఆక్రమించుకొని ఎటువంటి అద్దె చెల్లించకుండా స్కూల్ నిర్వహిస్తున్నారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై గతంలో విచారణ జరిపిన హైకోర్టు .. పిటిషనర్ కు రూ.25 లక్షలు చెల్లించాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ ఆదేశాలను మున్సిపల్ కమిషనర్ అమలు చేయలేదు. దీంతో హైకోర్టు ఆదేశాలను కమిషనర్ అమలు చేయడం లేదంటూ మరో సారి పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించారు.
పిటిషనర్ దాఖలు చేసిన కోర్టు దిక్కరణ వ్యాజ్యంపై విచారణ చేపట్టిన హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. మున్సిపల్ కమిషనర్ కీర్తికి నెల రోజుల జైలు శిక్ష, రూ.2వేల జరిమానా విధించింది. జనవరి 2న హైకోర్టు రిజిస్ట్రార్ ముందు లొంగిపోవాలని కమిషనర్ ను హైకోర్టు ఆదేశించింది. ఇటీవలే ఇద్దరు సీనియర్ ఐఏఎస్ లకు హైకోర్టు జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే.
Komatireddy Venkat Reddy: ఏపీకి ప్రత్యేక హోదాపై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు