టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా వైసీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై బాపులపాడు మండలం రంగన్నగూడెంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో గాయపడిన వైసీపీ కార్యకర్తను గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పరామర్శించి బాధితులతో కలిసి నిన్న వీరవల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వంశీ ఫిర్యాదు చేసిన వెళ్లిపోయిన తర్వాత వైసీపీ శ్రేణులు స్టేషన్ వద్దనే ఉన్నారు. ఆ సమయంలో పోలీస్ స్టేషన్ వద్దకు ఫిర్యాదు చేయడం కోసం టీడీపీ మాజీ మంత్రులు దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, గన్నవరం టీడీపీ ఇన్ చార్జి యార్లగడ్డ వెంకట్రావు తదితరులు చేరుకున్నారు.
ఈ సమయంలో ఇరువర్గాలు పోలీస్ స్టేషన్ వద్దే బాహాబాహీకి దిగడంతో ఘర్షణ చోటుచేసుకంది. ఇరవర్గాలు కుర్చీలు విసురుకున్నారు. దీంతో అదనపు బలగాలను వీరవల్లి పోలీస్ స్టేషన్ కు రప్పించి ఉద్రిక్తతను అదుపు చేశారు. టీడీపీ, వైసీపీ నేతలు పరసర్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. కాగా, టీడీపీ నేతలు దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, కొనకళ్ల నారాయణ, యార్లగడ్డ వెంకట్రావుతో పాటు మరి కొందరిపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కేసులు నమోదు అయ్యాయి.
మరో పక్క యువగళం సభల్లో రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారన్న అభియోగంపై వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని ఫిర్యాదు మేరకు టీడీపీ మాజీ మంత్రి అయన్నపాత్రుడు, టీడీపీ నేత బుద్దా వెంకన్నపై ఆత్కూరు పీఎస్ లో విడివిడిగా కేసులు నమోదు అయ్యాయి.
Breaking: కృష్ణా ఎక్స్ ప్రెస్ ట్రైన్ కు తప్పిన పెను ప్రమాదం