Breaking: కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. ఏసీ బోగీలో పొగ రావడంతో ప్రయాణీకులు అప్రమత్తమైయ్యారు. ప్రయాణీకులు ట్రైన్ చైన్ లాగి నిలుపుదల చేయడంతో పెను ప్రమాదం తప్పింది. నెల్లూరు జిల్లా వెంకటగిరి సమీపంలో తిరుపతి – అదిలాబాద్ కృష్ణా ఎక్స్ ప్రెస్ కు ప్రమాదం తప్పింది. బ్రేక్ డౌన్ అవ్వడంతో ఏసీ కోచ్ నుండి పొగలు వ్యాపించాయి.
దీంతో ప్రయాణీకులు అప్రమత్తమై చైన్ లాగి రైలును నిలుపుదల చేసారు. ప్రయాణీకులు అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. అరగంటకుపైగా కృష్ణా ఎక్స్ ప్రెస్ ట్రైన్ వెంగటగిరి సమీపంలో నిలిచిపోయింది. ట్రైన్ ఆగిన వెంటనే ప్రయాణీకులు రైలు దిగి పరుగులు తీశారు. ఏసీ బోగీ నుండి పొగలు రావడానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తరచు ట్రైన్ ప్రమాదాలు జరుగుతుండటంపై ప్రయాణీకులు ఆందోళనలు చెందుతున్నారు.
వైసీపీ జిల్లా నూతన కార్యవర్గాల నియామకం