Chandra babu : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోమారు ఉత్కంఠగా ఉండే రోజు ఇది. ఎందుకంటే ఏపీలో హాట్ హాట్గా మారిన పంచాయతీ ఎన్నికల్లో తుది విడత పోరు నేటితో తెర పడనుంది.
నాలుగో విడత ఎన్నికల నిర్వహణకు అన్ని రకాల ఏర్పాట్లు ఎస్ఈసీ పూర్తి చేసింది. కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే మూడు విడతల్లో టీడీపీకి ఊహించని రీతిలో తక్కువ స్థానాలను కైవసం చేసుకున్న టీడీపీకి తాజా విడతలో సైతం అదే ఫలితం తప్పదా? అనే చర్చ జరుగుతోంది.
ఇప్పటికే ఏకగ్రీవాలు..
నాలుగు విడతలుగా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ శ్రీకారం చుట్టగా.. మూడు విడతలను విజయవంతంగా పూర్తి చేసిన చేసిన ఎస్ఈసీ.. నాలుగో విడత ఎన్నికలకు సమాయత్తమవుతోంది. నాలుగో విడతలో మొత్తంగా 3229 పంచాయతీలకు ఎస్ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది . వీటిల్లో 554 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. ఇక నాలుగో విడతలో 33 ,435 వార్డులకు గానూ.. 10 ,921 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో మిగిలిన వాటికి ఎన్నికలు జరగనున్నాయి.
ఎక్కడెక్కడ ఎన్నికలు ?
రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలలోని, 16 రెవిన్యూ డివిజన్ల పరిధిలో 161 మండలాలలో తుది విడత ఎన్నికలు జరగనున ఎన్నికలు జరగనున్నాయి. నాలుగో విడతలో 67,75,226 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఇక నాలుగో విడతలో 2,745 సర్పంచ్ స్థానాలకు గాను కడప జిల్లాలో రెండు చోట్ల నామినేషన్లే దాఖలు కాలేదు. దీంతో మిగిలిన 2,743 స్థానాలకు 7,475 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇక 22,514 వార్డు మెంబర్ల స్థానాలకు గాను 91 స్థానాలలో నామినేషన్లు పడలేదు. ఈ క్రమంలో మిగిలిన 22,423 వార్డు మెంబర్ల స్థానాలకు గాను 52,700 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ ఎన్నికల నిర్వహణ కోసం నాలుగో విడతలో 28,995 పోలింగ్ స్టేషన్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ విడతలో కూడా టీడీపీకి చేదు అనుభవాలు ఎదురుకానున్నాయా? అంటే వేచి చూడాల్సిందే.