Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఇవేళ ఏపీ సీఐడీ కార్యాలయాలకు వెళ్లనున్నారు. చంద్రబాబుకు పలు కేసుల్లో ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇసుక, లిక్కర్ కేసుల్లో చంద్రబాబుకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో సంబంధిత దర్యాప్తు అధికారులకు వారం రోజుల్లోగా పూచీకత్తుతో పాటు లక్ష విలువ గల బాండ్ సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు చంద్రబాబు శనివారం స్వయంగా సీఐడీ కార్యాలయానికి చేరుకుని పూచికత్తు సమర్పించనున్నారు.
హైదరాబాద్ లోని తన నివాసం నుండి మధ్యాహ్నం 1.25 గంటలకు హెలికాఫ్టర్ ద్వారా ఉండవల్లిలోని నివాసానికి చంద్రబాబు చేరుకుంటారు. అక్కడి నుండి రోడ్డు మార్గంలో మధ్యాహ్నం 3.15 గంటలకు గుంటూరు నగరంలోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి వెళతారు. సాయంత్రం 4.20 గంటలకు తాడేపల్లి, 5.05 గంటలకు తాడిగడప లోని సీఐడీ కార్యాలయాలకు కూడా వెళ్లి పూచీకత్తు బాండ్ సమర్పిస్తారు.
CM YS Jagan: ఆరోగ్య సురక్ష క్యాంప్ లపై సీరియస్ గా దృష్టి పెట్టాలి – సీఎం జగన్