NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Chandrababu: వివేకా హత్య కేసు నిందితులకు ప్రాణ హాని ..చంద్రబాబు సంచలన ఆరోపణ..

Chandrababu: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితులు కడప సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవలే కడప సెంట్రల్ జైలు అధికారిగా వరుణ్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అనంతపురం జైలులో వరుణ్ రెడ్డి జైలర్ గా ఉన్న సమయంలో పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడు మొద్దు శ్రీను హత్య జరిగింది. ఆ తరువాత ఆయన సస్పెండ్ అయ్యారు. ఇప్పుడు ఆ వరుణ్ రెడ్డి కడప జైలు అధికారిగా ఉండటంపై వివేకా హత్య కేసులో నిందితులకు ప్రాణ హాని ఉందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు అనుమానం వ్యక్తం చేశారు. శనివారం చంద్రబాబు విజయవాడలోని పరుచూరి అశోక్ బాబు నివాసానికి వెళ్లి పరామర్శించారు. అశోక్ బాబును సీఐడీ అధికారులు అరెస్టు చేసి నిన్న రాత్రి న్యాయమూర్తి సమక్షంలో హజరుపర్చిన విషయం తెలిసిందే. అశోక్ బాబు బెయిల్ పై ఇంటికి రావడంతో శనివారం ఆయన నివాసానికి వెళ్లి చంద్రబాబు పరామర్శించారు.

Chandrababu comments on viveka murder case issue
Chandrababu comments on viveka murder case issue

 

Read More: AP Special Status: ఏపికి గుడ్ న్యూస్.. ముగిసిపోయిన ప్రత్యేక హోదా అంశం మళ్లీ తెరపైకి

Chandrababu: కడప జైలు అధికారి వరుణ్ రెడ్డిపై అనుమానం

అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు సంచలన కామెంట్స్ చేశారు. జైలు అధికారి వరుణ్ రెడ్డిపై అనేక శాఖాపరమైన కేసులు ఉన్నాయనీ, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆయనను పక్కన పెట్టాయని అన్నారు చంద్రబాబు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత వరుణ్ రెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చి కడప జైలు ఇన్ చార్జి సూపర్నిటెండెంట్ గా నియమించారన్నారు. వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులను చంపేందుకే వరుణ్ రెడ్డిని అక్కడకు పంపారా అని చంద్రబాబు ప్రశ్నించారు. కడప జైలు అధికారిగా వరుణ్ రెడ్డి నియామకంపై సీబీఐకి లేఖ రాయనున్నట్లు తెలిపారు చంద్రబాబు. జగన్ రెడ్డి, అవినాష్ రెడ్డి సాయంతో వరుణ్ రెడ్డి ద్వారా వివేకా హత్య కేసు నిందితులకు ప్రాణహాని పొంచి ఉందని చంద్రబాబు ఆరోపించారు.

Read More: Tirumala: ఆర్ధిక ఇబ్బందుల్లో ఏపీ..! వెంకన్నపైనే భారం..

అశోక్ బాబు అరెస్టు అన్యాయం

అశోక్ బాబును అన్యాయంగా అరెస్టు చేశారని చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ముగ్గురు మాజీ మంత్రులను అరెస్టు చేశారన్నారు. 33 మంది టీడీపీ నేతలను హత్య చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్యాయానికి గురైన ప్రతి ఒక్కరి పక్షాన పోరాడి వైసీపీ ప్రభుత్వం గుండెల్లో నిద్రపోతామన్నారు చంద్రబాబు. తప్పు చేసే ప్రతి అధికారి తప్పించుకోలేరని చంద్రబాబు హెచ్చరించారు.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N