టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ నేతలు గురువారం వరద బాధితుల పరామర్శ కార్యక్రమంలో భాగంగా కోనసీమ జిల్లాలో పర్యటించారు. సోంపల్లి వద్ద చంద్రబాబు ప్రయాణిస్తున్న పంటు ర్యాంపు తెగింది. చంద్రబాబు, టీడీపీ నేతలు పంటు దిగేందుకు ఒక్కసారిగా పంటు చివర ర్యాంపు వద్దకు చేరుకున్నారు. చంద్రబాబును ముందుగాీ భద్రతా సిబ్బంది పంటు నుండి నాటు పడవ ఎక్కించారు. ఈ తరుణంలో వేరొక నాటు పడవ ఎక్కేందుకు ర్యాంపు మీదకు నేతలంతా రావడంతో ఒక్కసారిగా తెగి గోదావరి గోదావరిలో పడిపోయారు. బరువు కారణంగా ఫంటు ముందు భాగం రెక్క తెగింది.
దీంతో ఒక్కసారిగా మాజీ మంత్రులు దేవినేని ఉమా, పితాని సత్యనారాయణ. ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు, ఎమ్మెల్యే రామరాజు, నేతలు, చంద్రబాబు ఎస్పీజీ భద్రతా సిబ్బంది, మీడియా ప్రతినిధులు నీటిలో పడిపోయారు. వెంటనే లైఫ్ జాకెట్లు వేసి వారిని సిబ్బంది కాపాడారు. ఈ ఘటనలో పలువురికి గాాయాలు అయ్యాయి. ఒడ్డుకు సమీపంలో ప్రమాదం జరగడంతో ప్రాణపాయం తప్పింది. ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
వరద ప్రాంతాల్లో చంద్రబాబు రాజకీయ యాత్ర అంటూ సజ్జల సెటైర్