Chandrababu Arrest: స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్, సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ మంగళవారానికి వాయిదా పడింది. సీఐడీ కస్టడీ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబు తరపు న్యాయవాదులకు న్యాయస్థానం ఆదేశించింది. ఈ రెండు పిటిషన్లపై మంగళవారం విచారణ జరిపి ఉత్తర్వులు ఇస్తామని న్యాయస్థానం పేర్కొంది. తొలుత రెండు రోజుల కస్టడీ నివేదికను సీఐడీ అధికారులు సీల్డ్ కవర్ లో న్యాయస్థానానికి అందజేశారు. మరో అయిదు రోజులు కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది.
తొలుత బెయిల్ పిటిషన్ పై విచారణ జరపాలని చంద్రబాబు తరపు న్యాయవాది ప్రమోద్ దూబే కోరగా, ముందుగా కస్టడీ పిటిషన్ ను విచారించాలని సీఐడీ తరపు న్యాయవాదులు ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, వివేకానందలు న్యాయమూర్తిని కోరారు. ఇరుపక్షాలు గట్టిగా వాదనలు చేయడంతో చంద్రబాబు తరపు న్యాయవాదులపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తొంది. ఏ పిటిషన్ విచారించినా తీర్పు వెంటనే ఇవ్వమనీ, రెండు పిటిషన్ల విచారణ తర్వాతనే తీర్పు వెల్లడించడం జరుగుతుందని న్యాయమూర్తి తెలిపారు.
ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి .. రూల్స్ ప్రకారం పిటిషన్ల పై విచారణ జరుపుతామని పేర్కొంటూ రెండు పిటిషన్ల పై విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. మరో ఏపీ హైకోర్టులో చంద్రబాబు తరపున కస్టడీ ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఇప్పటికే కస్టడీ ముగిసినందున పిటిషన్ అర్హత కోల్పోయిందని తెలియజేస్తూ హైకోర్టు డిస్మిస్ చేసింది. మరో వైపు సుప్రీం కోర్టులో చంద్రబాబు తరపు దాఖలైన క్వాష్ పిటిషన్ పై రేపు ప్రస్తావించడానికి సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం అనుమతి ఇచ్చింది.
TS News: కేసిఆర్ సర్కార్ కు ఝలక్ ఇచ్చిన గవర్నర్ తమిళి సై .. ఎమ్మెల్సీ అభ్యర్ధిత్వాలు తిరస్కరణ