YS Jagan: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్నే మా భవిష్యత్తు మెగా పీపుల్స్ సర్వే శనివారం నాటితో రాష్ట్ర వ్యాప్తంగా ముగిసింది. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని కోటి 45 లక్షల కుటుంబాలను కలిసి సీఎం జగనన్న పాలనపై వారి అభిప్రాయాలను సేకరించింది. సీఎం జగన్ పాలనకు1.1 కోట్ల కుటుంబాలు మిస్ట్ కాల్ ద్వారా మద్దతు ప్రకటించారు. ఈ మెగా సర్వే పూర్తి వివరాలను పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ సీనియర్ నేతలు మీడియాకు వెల్లడించారు. ఈ సర్వేతో వైఎస్ఆర్ సీపీ రాజకీయంగా బలంగా ఉందని నిరూపించిందన్నారు. ఈ మెగా సర్వే అన్ని రకాలుగా పారదర్శకంగా జరిగిందన్నారు. ఇలాంటి కార్యక్రమం దేశంలో ఏ రాజకీయ పార్టీ ఇంత వరకూ చేపట్టలేదన్నారు. మొత్తం ఆరు లెవల్స్ లో ఈ మెగా సర్వే పూర్తి చేశామని రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా విజయవంతం చేసిన వైసీపీ క్యాడర్ కు, రాష్ట్ర ప్రజలకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. “సుపరిపాలన, ప్రభుత్వ విధానాలపై అచంచలమైన నమ్మకాన్ని ఉంచి ఫోన్ చేసి మద్దతు తెలిపిన 1,16 కోట్ల కుటుంబాలకు, పార్టీ క్యాడర్ కు ధన్యవాదాలు” అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. “ప్రజలకు మరింత సేవ చేసేందుకు దేవుని దయ, మీ చల్లని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను” అని ట్విట్టర్ లో పేర్కొన్నారు.
Pawan Kalyan CBN: చంద్రబాబు తో పవన్ కళ్యాణ్ భేటీ .. తాజా రాజకీయ పరిణామాలపై చర్చ