Delta Virus: కరోనా థర్డ్ వేవ్, డెల్టా వైరస్ గురించి గత కొద్దిరోజులుగా ప్రజల్లో ఆందోళన మొదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రపంచం థర్డ్ వేవ్ ప్రారంభ దశలో ఉందని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించగా డెల్టా వైరస్ గురించి మరింత కలవరం నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రానున్న 100-125 రోజులు అతి కీలకమని తెలిపింది. తాజాగా తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ సంచాలకు డి.హెచ్ శ్రీనివాస్ రావు మరో సంచలన ప్రకటన చేశారు. గాలి ద్వారా డెల్టా వైరస్ సోకుతుందని తెలిపారు.
Read More: Corona: కరోనా థర్డ్ వేవ్ లో డేంజర్ డేస్ ఎప్పుడో తెలుసా?
డెల్టా కొంప ముంచనుంది..
డెల్టా వెరియంట్ ప్రభావం ఎక్కువగా ఉందని తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ సంచాలకు డి.హెచ్ శ్రీనివాస్ రావు ప్రకటించారు. అందుకే ఇంటా, బయట మాస్క్ ధరించాలని సూచించారు. కరోనా వైరస్ ముప్పు ఇంకా తగ్గలేదన్నారు. ఏప్రిల్ నుండి నవంబర్ వరకు మొదటి వేవ్ జరిగిందని చెప్పారు. రాబోయే 2,3 నెలలు సెకండ్ వేవ్ ప్రభావం ఉంటుందన్నారు. సీఎం ఆదేశాలతో 7జిల్లాలు 11 ప్రాంతంలో వైద్య ఆరోగ్య శాఖ తిరిగి చూడటం జరిగిందని తెలిపారు. వైరస్ కంట్రోల్ చెయడం కోసం లక్ష వరకు టెస్టులు చేస్తున్నట్లు తెలిపారు.
Read More: Corona: కరోనా థర్డ్ వేవ్ ఎంత డేంజరస్ అనేది మీరు ఇలా తెలుసుకోవచ్చు!
ఆందోళన కలిగిస్తున్న రాజకీయ నాయకులు…
తెలంగాణ రాష్ట్రంలో పొలిటికల్ యాక్టివిటి ఎక్కువ అయ్యిందని తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ సంచాలకు డి.హెచ్ శ్రీనివాస్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్కువ గుంపులు సమూహాలూ లేకుండా చూసుకోవాలని ఆయన సూచించారు. రాజకీయ నాయకులు ఎవరూ కరోనా రూల్స్ పాటించడం లేదని, మాస్క్ పెట్టుకోవడం లేదన్నారు. రాజకీయ నాయకులు ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొవాలన్నారు. దాదాపు ఇంకా రెండేళ్లు పాటు కరోనా వైరస్తో పోరాడాల్సి ఉంటుందని తెలిపారు.