Nandyala: అమరావతి జేఏసి ఆధ్వర్యంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు తమ డిమాండ్ల పరిష్కారం కోరుతూ నంద్యాల పట్టణంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఐటీయు జిల్లా అధ్యక్షుడు వి ఏసురత్నం, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్, మహమ్మద్ గౌస్, జిల్లా కార్యదర్శి వెంకట లింగం పాల్గొని మద్దతు తెలియజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి రాగానే కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చారన్నారు. అదే విధంగా సీపీఎస్ రద్దు చేసి ఓపిఎస్ ను పునరుద్దరిస్తామని చెప్పారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హామీలను నెరవేర్చలేదన్నారు. తక్షణం సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు.
ప్రముఖ పాఠశాలకు బాంబు బెదిరింపు .. అప్రమత్తమైన యాజమాన్యం.. చివరికి తేలింది ఏమిటంటే..?