Madanapalli (chittoor): అగ్ని ప్రమాదం కారణంగా చెప్పుల దుకాణం దగ్ధం అయిన ఘటన మదనపల్లి పట్టణంలో మంగళవారం వేకువ జామున జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు రెండు లక్షలకుపైగా ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తొంది. వివరాల్లోకి వెళితే..మదనపల్లి పట్టణంలోని అవెన్యూ రోడ్డులో జ్యోతి సినిమా థియేటర్ ఎదురుగా ఉన్న పాదరక్షల దుకాణంలో నుండి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
స్థానికులు సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. అయినప్పటికీ చెప్పుల దుకాణం పూర్తిగా దగ్దమైంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ప్రమాదం కారణంగా దాదాపు రెండు లక్షలకుపైగా ఆస్తినష్టం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.