Vijayawada: సీఎం వైఎస్ జగన్ మంగళవారం ఉదయం విజయవాడలో పర్యటించారు. విజయవాడ రాఘవయ్య పార్క్ సమీపంలోని మిషనరీస్ ఆఫ్ చారిటీ నిర్మల్ హృదయ్ భవన్ ను సీఎం జగన్, భారతి దంపతులు సందర్శించారు. వీరికి ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు తదితరులు స్వాగతం పలికారు.
అక్కడ నిర్మించిన నూతన భవనాన్ని సీఎం జగన్ పిల్లలతో కలిసి ప్రారంభించారు. నిర్మల్ హృదయ్ భవనంలో ఆశ్రయిం పొందుతున్న అనాథ పిల్లలతో సీఎం జగన్ దంపతులు ముచ్చటించారు. ఆశ్రమ ఆవరణలో ఉన్న మదర్ థెరిస్సా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమం అనంతరం తిరిగి తాడేపల్లి నివాసానికి బయలుదేరారు.
https://t.co/LWj1FtHftr pic.twitter.com/4a0pMMbGpR
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) May 30, 2023