ఏపీ అధికార పార్టీ వైసీపీలో కొందరు నక్కతోక తొక్కారు. ఇలాంటి వారి విషయంలో వీరంతా లక్కీ బ్రో అనే టాక్ వినిపిస్తోంది. దీనికి కారణం.. కొన్ని కొన్ని నియోజకవర్గాలను తీసుకుంటే.. అత్యంత సామాన్యులకు టికెట్లు ఇచ్చారు. కానీ, ఎన్నికలు చూస్త.. భయంకరమైన.. ఖర్చుతో కూడుకున్నాయి. అటు టీడీపీ అయినా.. ఇటు బీజేపీ అయినా.. ఖర్చు పెట్టేవారికే అవకాశం ఇచ్చింది. ఖర్చు భరించగలరన్న వారికే అవకాశం ఇచ్చింది.
కానీ, వైసీపీ విషయానికి వస్తే.. ఇక్కడ మాత్రం తక్కువ తినలేదు. ఖర్చు పెట్టే వారికి మాత్రమే సీట్లు ఇచ్చా రు. అయితే.. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం సీఎంజగన్ ప్రయోగాలు చేశారు. అకౌంట్లలో లక్ష రూపాయలు కూడా లేని వారికి టికెట్లు ఇచ్చారు. వీరిలో శింగనమల సీటు నుంచి పోటీ చేస్తున్న వీరాంజ నేయులు, కీలకమైన మైలవరం నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న సన్యాల తిరుపతిరావు, ఇచ్చాపురం నుంచి పిరియా విజయ వంటివారు ఉన్నారు. ఇక, ఎంపీ సీట్ల విషయానికి వస్తే.. నందిగం సురేష్(బాపట్ల), గురుమూర్తి(తిరుపతి) వంటివారు ఉన్నారు. వీరు ఆర్థికంగా ఏమీ బలంగా లేరు.
అయినప్పటికీ.. వైసీపీ అధినేత వీరికి టికెట్లు ప్రకటించారు. కానీ, అటు వైపు చూస్తే.. ఇలాంటి నియోజకవర్గాల్లో టీడీపీ నుంచి కానీ కూటమి పార్టీల నుంచి కానీ.. బలమైన అభ్యర్థులు.. కోట్లకు కోట్లు ఖర్చు పెట్టే వారికి టికెట్లు వరించాయి. మరి వారి పోటీని తట్టుకుని వీరు ఏమేరకు నిలబడతారు? అనేది మిలియన్ల డాలర్ల ప్రశ్న. దీనిపై వారికి మాత్రం సందేహం లేదా? అంటే.. ఉంది. అయితే.. ఇక్కడ జగన్ హామీ ఇచ్చారనేది టాక్.
ఇలాంటి నియోజకవర్గాల విషయంలో సీఎం జగన్ స్వయంగా బాధ్యతలు తీసుకున్నారని తెలుస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో నేరుగా పార్టీ కొంత ఫండ్ ఇస్తుంది. మిగిలిన వాటికి ఇవ్వదు. అదేవిధంగా .. జగన్కు తెలిసిన పారిశ్రామిక వేత్తలు.. కూడా.. ఈ నియోజకవర్గాల్లో అభ్యర్థులకు నిధులు సమకూర్చినట్టు సమాచారం. తిరుపతిరావుకు ఇప్పటికే ఒక ప్రముఖ పారిశ్రామిక వేత్త నుంచి రూ.5 కోట్లు అందాయని తెలిసింది. పిరియా విజయకు.. కూడా ఇలానే సాయం అందించారు. ఇలా.. అభ్యర్థుల చేతిలో రూపాయి లేకపోయినా.. జగన్ మనసు పెట్టి వారికి టికెట్లు ఇవ్వడంతో నే సరిపుచ్చకుండా.. వారిని గెలిపించుకునే బాధ్యతలను కూడా తీసుకోవడం గమనార్హం.