ఎటు చూసినా.. సర్వేలు వస్తున్నాయి. రోజుకు రెండు చొప్పున కూడా సర్వేలు దంచికొడుతున్నాయి. క్షేత్ర స్థాయిలో కీన్ అబ్జర్వేషన్ చేసుకుని మరీ.. ఈ సర్వేలు వండి వారుస్తున్నారు. కొన్ని కొన్ని సర్వేలు.. పైపైనే రిజల్ట్ ఇస్తుండగా.. మెజారిటీ సర్వేలు మాత్రం మండలస్థాయి.. గ్రామ స్థాయి వరకు పార్టీల పరిస్థితి ఎలా ఉంది? అభ్యర్థుల పరిస్థితి ఎలా ఉంది? అనే కీలక విషయాలను అంచనా వేసుకుని మరీ.. సర్వేలు వండి వారుస్తున్నాయి. ఇలా వస్తున్న సర్వేల్లో అభ్యర్థుల పరిస్థితి ఏంటనేది స్పష్టంగా తెలుస్తోంది.
దీంతో పార్టీలు అలెర్ట్ అవుతున్నాయి. వాస్తవానికి ఇప్పటికే అన్ని పార్టీలూ టికెట్లు దాదాపు ఖరారు చేశా యి. కానీ, నామినేషన్ల పర్వం ప్రారంభమయ్యే సమయానికి.. వచ్చిన దాదాపు 20 సర్వేల్లో కొందరు అభ్యర్థు ల విషయంలో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని బలంగా తెలుస్తోంది. ఒక సర్వేలో తప్పు చెప్పారని అనుకున్నా.. మరికొన్ని సర్వేల్లోనూ అదే ఫలితం కనిపిస్తోంది. దీంతో పార్టీలు అలెర్ట్ అవుతున్నాయి. ఉదాహరణకు.. ఒక సర్వేలో ఒక అభ్యర్థి నెక్ టు నెక్ ఫైట్ చేస్తున్నారని ఫలితం వస్తోంది.
మరో సర్వేలో.. ఆయన గెలుస్తాడని చెబుతున్నారు. దీనిని కొంత వరకు పార్టీలు.. హర్షిస్తున్నాయి. నెక్ టు నెక్ ఉన్న నియోజకవర్గాల్లో అభ్యర్థులను అలెర్ట్ చేస్తున్నాయి. ఇక, అన్నిసర్వేల్లోనూ గెలుపు గుర్రం ఎక్క డం కష్టమని వస్తున్న పలితాల విషయంలోనే పార్టీలు తర్జన భర్జన పడుతున్నాయి. ముఖ్యంగా వైనాట్ 175 నినాదంతో ఎన్నికలకు వెళ్తున్న వైసీపీలో ఈ తరహా నాయకులు పెరుగుతున్నారు. దీంతో ఇలాంటి వారిని మార్చడం ఖాయమనే చర్చ సాగుతోంది. ఇక, టీడీపీలోనూ మార్పు ఖాయమని అంటున్నారు.
ఉదాహరణకు.. టీడీపీ సింగనమల అభ్యర్థి విషయంలో సర్వేలు యాంటీగా ఇస్తున్నాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. ఇప్పటి వరకు వచ్చిన అన్ని సర్వేల్లోనూ సింగనమల వదులుకోవడం ఖాయమని చెప్పారు. అదేవిధంగా దెందులూరు పరిస్థితి కూడా అలానే ఉందని టాక్. ఈ విషయాన్ని కూడా సర్వేలు చెబుతు న్నాయి. అలానే.. తిరువూరు విషయంలోనూ టీడీపీకి ఎదురు గాలి వీస్తోంది. దీంతో ఈ రెండు పార్టీల్లోనూ మార్పులు తప్పదని హెచ్చరిస్తున్నారు పార్టీ నాయకులు. అయితే.. అంతర్గత చర్చల్లో ఈ తరహా వ్యాక్యలు చేయడం గమనార్హం.