YSRCP: రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది. టీడీపీ – జనసేన పొత్తుతో ముందుకు వెళుతున్న తరుణంలో ఆయా పార్టీలో అసంతృప్తి నేతలపై వైసీపీ దృష్టి పెట్టింది. టీడీపీతో పొత్తు నచ్చని జనసేన నేతలు వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలోనే ఉమ్మడి కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గంలో జనసేన పార్టీకి బిగ్ షాక్ తగిలింది. జనసేన పార్టీకి రాజీనామా చేసిన నియోజకవర్గ జనసేన నేత యడ్లపల్లి రామ్ సుధీర్ ఇవేళ (సోమవారం) వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి సమక్షంలో యడ్లపల్లి రామ్ సుధీర్ తన అనుచరులు, స్నేహితులతో కలిసి వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. వీరికి సీఎం వైఎస్ జగన్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. రామ్ సుధీర్ తో పాటు స్థానిక జనసేన నాయకులు యడ్లపల్లి లోకేష్, పొలగాని లక్ష్మీనారాయణ, మద్దాల పవన్, తోట జగదీష్, ప్రసాద్ తదితరులు వైసీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో పెడన నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి జోగి రమేష్ పాల్గొన్నారు.
Kesineni Nani: మరో సారి సొంత పార్టీ నేతలపై కీలక వ్యాఖ్యలు చేసిన విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని