Naga Panchami December 18 2023 Episode 229: మీరు చెప్పింది అక్షరాల నిజం మోక్ష బాబు నిన్ను కాటు వేసి చంపే బాధ్యత నా నుంచి నాగదేవత తీసేసుకుంది ఏ క్షణానైనా మిమ్మల్ని చంపడానికి నిర్ణయం కూడా తీసుకుంది నేను కాళ్ళ మీద పడి బ్రతిమిలాడేసరికి ముక్కోటి ఏకాదశి వరకు మీకు ప్రాణ దీక్ష పెట్టింది అని పంచమి అంటుంది. ఇప్పుడైనా నా మాట విను పంచమి అని మోక్ష అంటాడు. ముక్కోటి ఏకాదశి మరుసటి రోజు వరకు నాకు టైం ఇవ్వండి మోక్ష బాబు అని పంచమి అంటుంది. పంచమి ఏ పాము చేతిలోనైనా చావడం నాకిష్టం లేదు నా చివరి నిమిషం నీ వల్లో కన్నుమూసేలా చూడు అని మోక్ష అంటాడు. నేను మీకు మాటే ఇస్తే నేను ఓడిపోయినట్టే మోక్ష బాబు నేను గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకోండి అని పంచమి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే,
యువరాణి విషయంలో నేను ఒక నిర్ణయానికి వచ్చాను యువ రాజా మోక్ష అని మన యువరాణి కాటేసి చంపదని నిర్ధారణ అయ్యింది అందుకే ఆ బాధ్యత నీ కప్పగిస్తున్నాను ఫణీంద్ర మోక్షని నువ్వే కాటేసి చంపాలి యువరాజా అని నాగదేవత అంటుంది. మీరు అదే చేస్తే అలాగే చేస్తాను మాట అని ఫణీంద్ర అంటాడు. యువరాణికి కూడా ఇదే హెచ్చరించాను ఇక యువరాణికి నాగలోక ప్రవేశ లేదు అని నాగదేవత అంటుంది. మరి నాగులోకానికి యువరాణి లేకపోతే నాగులోకానికి శ్రేయస్కరం కాదు కదా అని యువరాజ్ అంటాడు. ఎప్పుడు ఈ లోకానికి అలాంటి సమస్య రాలేదు యువరాజా ఏం చేద్దాం ఈ లోకంలో నాగమణి ని తాకే శక్తి ఒక మహారాణికి తప్ప ఇంకెవరికీ లేదు కార్తీక పౌర్ణమి నాడు నాగమణి ని తీసుకువెళ్లి నిండు వెన్నెల చంద్రుడిలో పెట్టి పూజలు జరిపిస్తే అప్పుడే ఆ నాగమణికి అన్ని శక్తులు వస్తాయి ఇవన్నీ రాని వంశస్థుల చేతులమీదుగానే జరగాలి అలా జరగకపోతే నాగమణి శక్తిహీనమై నాగలోకమే అంధకారమైపోతుంది అని నాగదేవత అంటుంది.
ఇంత ముఖ్యమైన నాగలోకాన్ని మనం చే చేతులారా పాడు చేసుకోదు కదా మాత మరి ఏదైనా మార్గం ఉందేమో చెప్పండి అని ఫణీంద్ర అంటాడు. ఒకే ఒక మార్గం ఉంది యువరాజా కానీ అది జరుగుతుందని నాకనిపించట్లేదు అని నాగదేవత చింతిస్తుంది. అది ఏంటో ఆదేశించండి మాత చేయడానికి ప్రయత్నిద్దాం అని ఫణీంద్ర అంటాడు. నువ్వు పాముగా మారినప్పుడు పంచమి నువ్వు కలిసి ఒక బిడ్డకు జన్మని ఇస్తే అది సాధ్యమవుతుంది అని నాగదేవత చెప్తుంది. పాముగా మారిన తర్వాతనే తన మనసు మార్చడానికి ప్రయత్నించు కానీ మోక్ష ఉన్నంతవరకు దేనికి పంచమి ఒప్పుకోదు అని నాగదేవత అంటుంది. మోక్షని ఏదో ఒకటి చేసి పంచమి ని నేను సొంతం చేసుకుంటాను నాగదేవత అని ఫణీంద్ర అంటాడు. యువరాజా ముక్కోటి ఏకాదశి నాడు కూడా మోక్షని చంపేది నువ్వే అని నాగదేవత అంటుంది. రెండు కార్యలను విజయవంతంగా పూర్తి చేసుకుని వస్తాను మాత నన్ను ఆశీర్వదించండి అని ఫణీంద్ర అంటాడు. సకల కార్య సిద్ధిరస్తు శుభమస్తు అని నాగదేవత దీవిస్తూది. కట్ చేస్తే,
మోహిని పూర్తిగా మారిపోయి అద్దం ముందు నిలబడి కరాలి కాదు మేఘన నిన్ను వశం చేసుకోవడానికి వస్తున్నాను మోక్ష అని అంటుంది మోహిని.ఈ మేఘన మత్తులో పడి పంచమిని పూర్తిగా మర్చిపోయేలా చేస్తాను అని అర్థం ముందు నిలబడి పక్కపక్క నవ్వుతుంది మోహిని. ధ్యానం చేసి వాళ్ళ అన్నని పిలుస్తుంది మోహిని. నన్ను క్షమించండి అన్నయ్య మిమ్మల్ని బ్రతికించడం కోసం మరో రూపాన్ని కూడా దాల్చాను అని మోహిని అంటుంది. కరాలి త్వరగా పని పూర్తి చేయి లేదంటే నా శరీరం పూర్తిగా శిథిలం అయిపోతుంది ఆ తరువాత నువ్వు నాగమణిని సంపాదించిన ఉపయోగం ఉండదు అని నంబూద్రి అంటాడు. నిన్ను బ్రతికించుకో లేనప్పుడు నీ దగ్గరికే వచ్చేస్తాను అన్నయ్య అని మోహిని అంటుంది. నీ ప్రయత్నం నువ్వు చేస్తున్నావ్ ఆ ఇష్ట రూపా నాగినీలు ఎవరిని అంత సులువుగా నమ్మవు అని నంబుద్రి అంటాడు. అందుకే అన్నయ్య నా రూపాన్ని మార్చుకున్నాను ఒక్కసారి నా మాయలో పంచమి పడితే చాలు అన్నయ్య తప్పించుకోలేదు అని మోహిని అంటుంది. నన్ను బ్రతికించకపోయిన పర్వాలేదు చెల్లెమ్మ నువ్వేనా క్షేమంగా ఉండు అని నంబూద్రి అంటాడు. ఈసారి నాగమణితోనే నీకు కనిపిస్తాను అని కరాలి అంటుంది.మన కోరిక నెరవేరాలని ఆశిద్దాం కరాలి జాగ్రత్త అమ్మ అని నంబూద్రి వెళ్ళిపోతాడు. పంచమి నిన్ను మట్టు పెట్టడానికి ఈ మేఘన వస్తుంది కాచుకో అని కరాలి అంటుంది. కట్ చేస్తే,
మోహిని వైదేహి కి ఫోన్ చేసి ఎలా ఉన్నారు ఆంటీ అని అడుగుతుంది. నేను బాగానే ఉన్నాను అని వైదేహి అంటుంది. మీరు ఎలా ఉన్నారు మోక్ష ఎలా ఉన్నాడు అని మోహిని అడుగుతుంది. మా మోక్షకి మృత్యుంజయ యాగం చేయడం వల్ల బ్రతికి బయటపడ్డాడు కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు అమ్మ నువ్వెక్కడున్నావో చెప్పు కారు పంపిస్తాను అని అంటుంది వైదేహి. ఆంటీ నేను మా ఊరు కేరళ వెళ్ళిపోతున్నాను మనిషిని పంపిస్తాను నా సామాను ఇచ్చి పంపించండి అని మోహిని అంటుంది. అలాగేనమ్మా కానీ అప్పుడప్పుడు వస్తూ ఉండు అని వైదేహి అంటుంది. ఏంటి వైదహి నాకైనా చెప్పొచ్చు కదా మోహిని నంబూద్రి గారి చెల్లెలు అని తనకి తెలిస్తే ఎంత బాధపడతారు అని రఘు అంటాడు.తన మర్యాదకు ఏమీ లోటు జరగలేదని గురువుగారు ఏం కోప్పడరులే అని వైదేహి అంటుంది.
ఎంతైనా మోహిని మంచి అమ్మాయి అని శబరి అంటుంది. మోహిని కొన్ని రోజులు ఇక్కడే ఉంటే నాకు ఉపయోగపడేది శబరి అని మోక్ష అంటాడు. ఏంటి అలాగే నిలబడి చూస్తున్నారు మోహిని సామాన్లన్నీ సర్ది పెట్టండి కారు వస్తుంది అని వైదేహి వెళ్ళిపోతుంది. మన మా అక్క అని ఇద్దరు ఆశ్చర్యపోతారు చిత్ర జ్వాలా. నేను గుడికి వెళ్లి వస్తాను మోక్ష బాబు అని పంచమి వెళ్ళిపోతుంది. మీరు చేతకాని దద్దమ్మలు కాబట్టి ఎవరివొ సామాన్లు మీ పేల్లలని బయట పెట్టమని మీ అమ్మ చెప్పింది అని జ్వాల అంటుంది. మొగులు పిలుల్ల ఉంటే పేల్లల్ని ఎలుకలాగే చూస్తారు అక్క అని చిత్ర అంటుంది. వీళ్ళతో మనకెందుకులే పదరా అని తరుణ్ వెళ్ళిపోతాడు. పద ఏం సరదాలో ఏమో అంటూ వెళ్తూ ఉంటారు చిత్రా జ్వాలా..
Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!