Madhuranagarilo December 18 2023 Episode 238: ఇంకెవరి వలన గొడవలు వస్తాయి భర్తకి రెండో భార్య ఉంటే మరిన్ని గొడవలు వస్తాయి అని రుక్మిణి అంటుంది. అదేంటమ్మా అల్లుడు గారితో అలా గొడవలు పెట్టుకుంటూ ఆఫీసులో పని ఎలా చేస్తావ్ అని నాగమణి అంటుంది. అవన్నీ నేను చూసుకుంటాను మీరు వెళ్లి అన్నం తినండి అని కోపంగా వెళ్ళిపోతుంది రుక్మిణి. కట్ చేస్తే, శ్యామ్ రాధ కోసం వెతుకుతూ ఉంటాడు. ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి అడుగుతాడు కానీ ఎవరు రాలేదు అని చెప్తారు. ఫ్రెండ్స్ దగ్గరికి కూడా వెళ్లకుండా రాదు ఎక్కడికి వెళ్లి ఉంటుంది అని శ్యామ్ టెన్షన్ పడుతూ ఉంటారు. రాధా మధ్యాహ్నం లంచ్ తీసుకుని వచ్చిన గాని ఎక్కడికి వెళ్లావు రాదా ఏమైపోయావ్ అని ఏడుస్తూ కారు డ్రైవింగ్ చేస్తూ రాధ కోసం వెతుకుతూ ఉంటాడు. కట్ చేస్తే, మధుర నాగమణికి ఫోన్ చేసి మీ అమ్మ అక్కడికి వచ్చిందా అని అడుగుతుంది. వదిన గారు ఎందుకు అలా అడిగారు అని నాగమణి అంటుంది. మధ్యాహ్నం శ్యామ్ కి అన్నం తీసుకు వెళ్లిన రాదా ఇంకా ఇంటికి రాలేదు ఒకవేళ అక్కడికి ఏమైనా వచ్చిందేమో అని అడుగుతున్నాను అని మధుర అంటుంది.
ఎక్కడికి వెళ్ళి ఉంటుంది ఏమైనా గొడవ అయిందా ఇంటిదగ్గర అని అడుగుతుంది నాగమణి. లేదండి ఈ గొడవ కాలేదు నేను తర్వాత మళ్లీ ఫోన్ చేస్తాను అని మధుర కట్ చేస్తుంది. అల్లుడికి అన్నం తీసుకువెళ్లి ఇంకా ఇంటికి వెళ్లలేదంట ఏమై ఉంటుంది అని నాగమణి బాధపడుతుంది. అమ్మాయికి ఏం కాదు వచ్చేస్తుంది అని మురళి అంటాడు. కాదండి అమ్మాయి అల్లుడు కోసం అన్నం తీసుకు వెళ్లినప్పుడు రుక్మిణి ని ఆఫీసులో చూసి ఉంటుందా తన అక్కే తన భర్తకి మొదటి భార్యని తెలుసుకొని ఎక్కడికైనా వెళ్లిపోయిందంటారా నాకెందుకు కంగారుగా ఉందండి అని నాగమణి అంటుంది. అలా జరిగితే రుక్మిణి మనకు చెప్పేది కదా చెప్పలేదు అంటే ఏమి జరగలేదు నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టకు నాగమణి అని మురళి అంటాడు. అదే గనుక జరిగితే రాధ జీవితం అన్యాయం అయిపోతుంది అండి అని నాగమణి బాధపడుతుంది.కట్ చేస్తే, శ్యామ్ అందరినీ ఫోటో చూపించి రాదను ఇక్కడ ఎవరైనా చూశారా అని అడుగుతాడు. ఎవరం చూడలేదండి అని అందరూ అంటారు. ఎక్కడికి వెళ్ళిపోయావు రాదా అని తల పట్టుకొని గట్టిగా అరుస్తాడు శ్యామ్.
అక్కడ ఒక శివాలయంలో గంట రోగుతుంది ఆ గంట వినగానే శ్యామ్ కి గుడిలోకి వెళ్ళాలి అనిపిస్తుంది అందులోకి వెళ్తాడు శ్యామ్. దేవుడా నేను ఎప్పుడూ నా కోసం ఏది అడగలేదు నా రాధ ఎక్కడ ఉందో కనపడేలా చేయి రాధా ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏమీ అర్థం కావట్లేదు తను నా వల్లే బయటికి వెళ్లిపోయిందా దేవుడా ఈ ఒక్కసారికి నా రాధ నాకు కనపడేలా చేయనా రాధా లేకపోతే నేను బ్రతకలేను అని శ్యామ్ అంటాడు. పెద్ద గాలి మెరుపులు ఉరుములు రావడంతో శ్యామ్ కళ్ళు ఇలా మూసుకొని ఇలా తుడుచుకుందామనుకుంటాడు అప్పుడు ధ్వజస్తంభం దగ్గర రాదా కనపడుతుంది గబగబా రాధా దగ్గరికి పరిగెత్తుకెళ్తాడు శ్యాంమ్ తనను చూసి సంతోష పడిపోతాడు శ్యామ్. రాధా ఏమైపోయావ్ ఎక్కడికి వెళ్ళిపోయావు ఏమైంది రాదా నీకు ఎందుకిలా వచ్చావ్ ఇప్పుడు దాకా ఇంటికి రాకపోతే అమ్మ వాళ్ళ ఎంత టెన్షన్ పడుతున్నారో తెలుసా అని శ్యామ్ అంటాడు. రాధా ఏమి మాట్లాడకుండా అలాగే మౌనంగా చూస్తూ నిలబడిపోతుంది.
ఏంటి రాధా మాట్లాడవు అడుగుతుంది నిన్నే ఎంత కంగారు పడిపోయానో తెలుసా నా ప్రాణం పోయినంత పని అయింది ఏంటి రాధా గుడి దగ్గరకు వచ్చి కూర్చున్నావ్ ఏం జరిగింది అని శ్యామ్ అంటాడు.ఎవరు ఎక్కడ ఉండాలో అర్థం కాక ఇలా వచ్చానండి అని రాదా అంటుంది. అదేంటి రాధ అలా అంటావ్ ఎవరు ఎక్కడ ఉండాలో ఏంటి నువ్వు మన ఇంట్లోనే కదా ఉండాలి అని శ్యామ్ అంటాడు. అది కాదండి పండు ఎక్కడ ఉండాలో మా అక్క ఎక్కడ ఉండాలో అర్థం కావట్లేదు అని రాదా అంటుంది. మీ అక్క గురించి నువ్వు ఎందుకు రాదా ఎంత టెన్షన్ పడుతున్నావ్ పండు గురించి మీ అక్క గురించి ఆలోచిస్తూ పండు ఆరోగ్యం బాగావాలని మీ బావ దొరకాలని గుడికి వచ్చి దీపాలు పెట్టుకొని మొక్కుకుంటున్నావా రా వెళ్దాం అని శ్యామ్ అంటాడు.
అత్తయ్య వాళ్లకు చెప్తే మా అక్కని ఇంట్లో ఉంచుకుంటారు అని రాధా అంటుంది. అమ్మ వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు రాదా నువ్వు ఏం మాట్లాడుతున్నావ్ అని శ్యామ్ అంటాడు. తల్లి కొడుకును వేరు చేయకూడదు అని అత్తయ్య మామయ్య అనుకుంటారు కదా అందుకే పండు దగ్గర అక్కను ఉండమంటారు అని రాదా మాట మారుస్తుంది. అవన్నీ ఇంటికి వెళ్లిన తర్వాత మాట్లాడుకుందాం రాదా పదా అని శ్యామ్ రాదని తీసుకొని వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మధురా ఇంటి దగ్గర టెన్షన్ పడుతూ ఉంది.
శ్యామ్ ఫోన్ చేసి నాన్న రాధ గుడి దగ్గర ఉంది తీసుకు వస్తున్నాను అని చెప్తాడు శ్యామ్. ఏంటి రాధ గుడికి వెళ్లిందా అని దాక్షాయిని అంటుంది. గుడికి వెళ్లిందా ఇంకెక్కడికి వెళ్లిందో ఏమైనా జరిగిందేమో అని నేను బాధపడ్డాను అని చలపతి అంటాడు. మీరు ఎప్పుడు మంచిగా ఆలోచించరా చెడ్డగానే ఆలోచిస్తారా ఒక మనిషి బయటికి వెళ్తే ఇంటికి ఎందుకు రాలేదు ఏం జరిగిందని ఆలోచించరా అని మధుర అంటుంది. కాదు చెల్లెమ్మ రాధ నీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్లిందని అలా నోరు జారి మాట్లాడింది ఇంకెప్పుడూ అలా అణములే అని చలపతి అంటాడు.అవును నువ్వు ఇందాక ఏవేవో మాట్లాడవు కదా అని మధుర అంటుంది. ఇంతలో శ్యామ్ రాదని తీసుకొని వస్తాడు. కంగారు పడిపోతూ గబగబా పరిగెత్తుకెళ్తుంది మధుర రాధ దగ్గరికి.ఏంటమ్మా రాదా మధ్యాహ్నం వెళ్ళిందానివి ఇప్పటిదాకా ఇంటికి రావా పండు నీకోసం ఎంత కంగారు పడుతున్నాడో చూడు అని మధుర అంటుంది. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!