MAA Elections: హోరా హోరీగా జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో నాగబాబు మద్దతు ఇచ్చిన ప్రకాశ్ రాజ్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగింది. ప్రకాశ్ రాజ్ పై మంచు విష్ణు 106 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. విష్ణుకు 380 ఓట్లు రాగా ప్రకాశ్ రాజ్ కు 274 ఓట్లు వచ్చాయి. మొత్తం 883 మంది సభ్యులకు గానూ 605 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 50 ఓట్లు చెల్లుబాటు కాలేదు. అయితే ప్రకాశ్ రాజ్ ను మొదటి నుండి నాన్ లోకల్ అంటూ ప్రత్యర్ధి ప్యానెల్ సభ్యులు ప్రచారం చేసి సక్సెస్ అయ్యారు. కాగా ప్రకాశ్ రాజ్ ఓటమి నేపథ్యంలో నాగబాబు మా పై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు.
MAA Elections: ‘మా’ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా
ప్రాంతీయ వాదం మరియు సంకుచిత మనస్థత్వంతో కొట్టుమిట్టాడుతున్న మువీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో కొనసాగడం ఇష్టం లేక మా అసోసియేషన్ లో తన ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు నాగబాబు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా తన రాజీనామా ప్రకటన చేశారు. విష్ణు గెలుపునకు మంచు మోహన్ బాబు తీవ్రంగా కృషి చేశారు. సినీ పరిశ్రమలో తనకు ఉన్న పరపతి, పరిచయాలను అన్నీ ఉపయోగించారు. మా ఎన్నికల నేపథ్యంలో ప్రకాశ్ రాజ్, విష్ణు ప్యానెల్ మధ్య తీవ్ర స్థాయిలో విమర్శలు, ప్రతి విమర్శలతో మాటల యుద్ధం సాగింది. ప్రకాశ్ రాజ్ కు మెగా కాంపౌండ్ సంపూర్ణ మద్దతు అని ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఓడిపోవడంతో నాగబాబు తీవ్ర మనస్థాపానికి గురైనట్లు తెలుస్తుంది. ఆ కారణంగానే మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారని భావిస్తున్నారు.ఓ పక్క ప్రచారం సందర్భంలోనూ, పోలింగ్ వద్ద ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్న ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్ సభ్యులు కౌంటింగ్ సమయంలో, పోలింగ్ కేంద్రం వద్ద ఒకరికి ఒకరు ఆలింగనాలు చేసుకుంటూ భుజాలపై చేతులు వేసుకుంటూ ఆప్యాయంగా పలకరించుకోవడం గమనార్హం. విశేషం.
భారీగా క్రాస్ ఓటింగ్
కేవలం 900 ఓట్లు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల రాజకీయం సాధారణ ఎన్నికలకు మించి జరిగింది. మా అసోసియేషన్ లో సభ్యులు, పోటీ చేసిన వారు సెలబ్రిటీలు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాలలోని సినీ అభిమానుల ఫలితాలపై మా ఎన్నికలపై అమిత ఆసక్తి కనబర్చారు. సెలబ్రిటీల మధ్య మాటల యుద్ధం కావడంతో మీడియా కూడా మా ఎన్నికలకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది. తన సోదరుడు చిరంజీవి మద్దతు కూడా ప్రకాశ్ రాజ్ కు ఉందని నాగబాబు చెప్పిన సంగతి తెలిసిందే. పోటీ ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్స్ మధ్య అయినప్పటికీ ఓ వైపు మోహన్ బాబు, మరో వైపు ‘చిరు’ పేరు రావడంతో కమ్మ వర్సెస్ కాపు అన్నట్లుగా మా ఎన్నికల రాజకీయం నడిచిందని వార్తలు వచ్చాయి. ఈ కారణంగానే భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిందని అంటున్నారు.
Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!