Breaking: తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గోవింద రాజస్వామి ఆలయ సమీపంలోని లావణ్య ఫోటో ఫ్రేమ్ షాపులో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతూ మూడు అంతస్తుల భవనానికి వ్యాపించాయి. చుట్టుపక్కల దుకాణాలకు మంటలు అంటుకున్నాయి. సమీపంలోనే గోవింద రాజస్వామి ఆలయ మహారథం ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మహారథానికి సైతం అగ్ని సెగలు తగుతున్నాయి. సమాచారం అందడంతో అగ్ని మాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
మహారథంకు మంటలు అంటుకోకుండా అగ్నిమాపక సిబ్బంది చర్యలు తీసుకున్నారు. మరో పక్క లావణ్య ఫోటో ఫ్రేమ్ షాపు మూడవ అంతస్తులో ఎవరైనా సిబ్బంది ఉన్నారా లేదా అనేది ఇంకా తెలియరాలేదు. ఈ ప్రమాదం నేపథ్యంలో గోవింద రాజస్వామి ఆలయంలోని అర్చకులు, భక్తులు అందరినీ బయటకు పంపించి వేశారు. మూడు అంతస్తుల షాపుతో పాటు పరిసర షాపులకు మంటలు వ్యాపించడంతో భారీగానే ఆస్తినష్టం జరిగినట్లుగా తెలుస్తొంది. ఆస్తి, ప్రాణనష్టానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది.
బాపట్ల జిల్లాలో దారుణం .. టెన్త్ విద్యార్ధి సజీవ దహనం