UCC Issue: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రేపటి నుండి జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో ఉమ్మడి పౌరస్మృతి బిల్లు(యూసీసీ) ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఏపిలోని ముస్లిం పెద్దలు, మత గరువులు ఓ పక్క వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి, మరో పక్క టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుతో ఇవేళ సమావేశమైయ్యారు. ఈ సమావేశంలో ఉమ్మడి పౌరస్మృతి అంశంపై తమ అభిప్రాయాలను మత పెద్దలు వారికి తెలిపారు. పార్లమెంట్ లో యూసీసీ బిల్లును వ్యతిరేకించాలని కోరారు. యూసీసీ దేశ సంస్కృతికి విరుద్దమని వివరించారు.
తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో కలిసిన ముస్లిం పెద్దలు, మత గురువులతో సీఎం జగన్ మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం, బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీల ప్రభుత్వం.. మీరు ఎలాంటి ఆందోళనకు, భయాలకు గురి కావాల్సిన అవసరం లేదు. మీ మనసు నొప్పించేలా ఎప్పుడూ కూడా ఈ ప్రభుత్వం వ్యవహరించదని స్పష్టం చేశారు. ఉమ్మడి పౌరస్మృతి అంశం మీద డ్రాఫ్ట్ అనేది ఇప్పటి వరకూ రాలేదన్నారు. అందులో ఏ అంశాలు ఉన్నాయో కూడా ఎవ్వరికీ తెలియదనీ, కానీ మీడియాలో, పలు చోట్ల చర్చ విపరీతంగా నడుస్తొందన్నారు. వాటిని చూసి ముస్లిం లు పెద్ద స్థాయిలో తమ మనోభావాలను వ్యక్తం చేస్తున్నారన్నారు.
ఏ నియమమైనా, ఏ నిబంధన అయినా సాఫీగా తీసుకురావాలని అనుకున్నప్పుడు నేరుగా ప్రభుత్వాలు కాకుండా ఆయా మతాలకు చెందిన సంస్థలు, పర్సనల్ లా బోర్డుల ద్వారానే చేయాల్సి ఉంటుందన్నారు. ఒక వేళ మార్పులు అవసరం అనుకుంటే ఈ విషయంలో సుప్రీం కోర్టు, లా కమిషన్, కేంద్ర ప్రభుత్వం కుడా అందరూ కలిసి, వివిధ మతాలకు చెందిన సంస్థలను, వారి పర్సననల్ లా బోర్డుతో మమేకమై, వారి పర్సనల్ లా బోర్డ్స్ ద్వారానే జరగాలని అన్నారు సీఎం జగన్.
ఇక చంద్రబాబు కూడా ముస్లింలకు విరుద్దంగా తమ పార్టీ నిర్ణయం ఉండబోదని భరోసా ఇచ్చారని ముస్లిం మత పెద్దలు తెలిపారు. ముస్లిం హక్కుల రక్షణకు కట్టుబడి ఉంటామని చంద్రబాబు చెప్పారన్నారు. మతపరమైన విశ్వాసాలకు ఉండగా ఉంటామని చంద్రబాబు హామీ ఇచ్చారని శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్ వెల్లడించారు.
Konakanamitla (Prakasam): లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిన కొనకనమిట్ల మహిళా ఎస్ఐ దీపిక