Nara Lokesh Vs Vijayasai: రాజమండ్రి సెంట్రల్ జైల్ లోని ఓ రిమాండ్ ఖైదీ డెంగీ బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందిస్తూ సంచలన కామెంట్స్ చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైల్ లో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏమి జరిగినా సీఎం జగన్ దే బాధ్యత అని అన్నారు. జైలులో అంతం చేసేందుకే చంద్రబాబును అరెస్టు చేశారనే అనుమానం ఉందని అన్నారు ఈ మేరకు లోకేష్ ట్వీట్ చేశారు.
“మా అనుమానాలు ఇప్పుడు బలపడుతున్నాయి. చంద్రబాబును జైల్ లో చంపేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రతిపక్ష నేతకు జైల్ లో హాని తలపెట్టేలా సర్కార్ కుట్ర పన్నుతోంది. జైలులో విపరీతంగా దోమలు కుడుతున్నాయని చెప్పినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. జైలులో రిమాండ్ ఖైదీ గా ఉన్న రాజమహేంద్రవరం రూరల్ మండలం ధవళేశ్వరానికి చెందిన గంజేటి వీరవెంకట సత్యనారాయణ డెంగీ బారినపడి మరణించారు. చంద్రబాబునూ ఇలానే చేయాలని సైకో కుతంత్రాలు అమలు చేస్తున్నారు. చంద్రబాబుకు ఏం జరిగినా సైకో జగన్ దే బాద్యత” అని లోకేష్ ట్వీట్ లో పేర్కొన్నారు.
లోకేష్ ట్వీట్ పై స్పందిస్తున్నట్లు గా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కౌంటర్ ట్వీట్ చేసారు. మీ వ్యవహారం చూస్తుంటే మీరు, మీ పార్టీ వారే .. జైల్ లో చంద్రబాబుకు హాని తల పెడతారన్న అనుమానం కలుగుతోందన్నారు విజయసాయి రెడ్డి. బాబుకు వెన్నుపోటు పొడిచి ఆయన పదవిని కొట్టేయాలన్న కసి కొందరు టీడీపీ నాయకుల్లో కనిపిస్తొందన్నారు. టీడీపీ వారితో జైలు అధికారులు అప్రమత్తంగా ఉండాలని విజయసాయి హెచ్చరించారు.
RK Roja: బావ కళ్లలో ఆనందం చూడటం కోసమే బాలయ్య ఫీట్లు అంటూ మంత్రి రోజా సెటైర్లు