Malli Nindu Jabili సెప్టెంబర్ 21 ఎపిసోడ్ 450: మనం పెద్దవాళ్ళం అయిపోయావు బాబు మల్లి మాలిని అక్క చెల్లెలుగా గౌతమ్ అరవింద్ అన్నదమ్ములుగా కలిసి ఉండాలనేదే నా కోరిక అని మీరా అంటుంది. కట్ చేస్తే మాలిని ఎంత ట్రై చేసినా వసుంధర ఫోన్ కలవదు ఇదేంటి మామ్ ఫోన్ కలవట్లేదు ఎలాగూ రేపు పూజ దగ్గర కలుస్తుంది అక్కడ మాట్లాడుతాను అని ఇమాలిని అనుకుంటుంది. కట్ చేస్తే ఇంతలో తెల్లవారింది మీరా నల్లపూసల పండక్కి అంత సిద్ధం చేస్తుంది. శరత్ ఎందుకు టెన్షన్ గా ఉన్నావ్ అని వాళ్ళ అమ్మ అంటుంది.
గౌతమ్ వాళ్ళు వస్తున్నట్టు అరవింద్ వాళ్లకి తెలియదు కదామా వాళ్ళిద్దరూ ఇక్కడికి వచ్చాక ఏం జరుగుతుందోనని ఆలోచిస్తున్నాను అని శరత్ అంటాడు. ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి శరత్ అని వాళ్ళ అమ్మ అంటుంది. ఇంతలో గౌతమ్ మల్లి వస్తారు మీకోసమే ఎదురు చూస్తున్నాను రండి లోపలికి వెళ్దాం అని మీరా వాలని తీసుకు వెళుతుంది. ఈ పూజ చేస్తే భార్యాభర్తలకు మంచి జరుగుతుంది అని శరత్ వాళ్ళ అమ్మ అంటుంది. మల్లిని నేను జాగ్రత్తగా చూసుకుంటాను ఆ విషయంలో మీరు ఏమి కంగారు పడొద్దు అని గౌతమ్ అంటాడు. కాసేపట్లో ముత్తైదులు వస్తారు పూజ మొదలవుతుంది అని మీరా అంటుంది. మీరు మాట్లాడుతూ ఉండండి అమ్మ నువ్వు ఒకసారి ఇలా రా అని మీరాని తీసుకొని మల్లి వెళ్ళిపోతుంది. అమ్మ ఏంటి వసుంధర గారు లేరా అని మల్లి అడుగుతుంది.
ఎక్కడో ఫంక్షన్ ఉందని వెళ్ళింది అని మీరా అంటుంది. ఇంతలో అరవింర్ మాలిని వస్తారు నిన్నటి నుండి మా అమ్మ ఫోన్ కలవట్లేదు లేదా అని మాలిని అంటుంది. మీ అమ్మ గెస్ట్ హౌస్ లో ఉంటుందమ్మా అని శరత్ అంటాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని మాలిని అంటుంది. నల్లపూసల పండుగ జరుగుతుందమ్మా ముత్తయిదువులని పిలిచి మల్లి కి నల్లపూసలు కూచిద్దామని పిలిచాను అని మీరా అంటుంది.
నిన్న ఈ విషయం చెబితే రానని అబద్ధం చెప్పారు కాదు ఈవిడ మాటలు విని మీరు ఇలా తయారయ్యారు అయినా మమ్మల్ని ఎందుకు పిలిచారు అరవింద్ మనం వెళ్దాం పద అని మాలిని అంటుంది. మాలిని ఏదైనా ఉంటే నిన్ననే మాట్లాడి సరి చేసుకోవాల్సింది ఇక్కడ దాకా వచ్చాక వెళ్ళకూడదు అని అరవింద్ అంటాడు. అరవింద్ ఇక్కడ ఏదో జరుగుతుంది గౌతమ్ కావాలని ఇలా చేస్తున్నాడు మనం ఇక్కడ ఉండదు అరవింద్ వెళ్ళిపోదాం పద అని మాలిని అంటుంది.మాలిని నామీద ప్రేమ ఉన్న దానివి అయితే ఈరోజుకి ఇక్కడే ఉందాము అని అరవింద్ అంటాడు. వీళ్ళని ఎందుకు పిలిచారు అంకుల్ అని గౌతమ్ అంటాడు.
ఎన్ని మనస్పర్ధలు ఉన్నా అందరం ఒకరికి ఒకరు కావలసిన వాళ్ళమే కదా అని శరత్ వాళ్ళ అమ్మ అంటుంది. వాళ్లు కావలసిన వాళ్లని ఎలా అనుకుంటానండి అని గౌతమ్ అంటాడు. మాలిని నా పెద్ద కూతురు మల్లి నా చిన్న కూతురు అరవింద్ నా అల్లుడు అల్లుడు కూతురు మా ఇంటికి వస్తే తప్పేంటి అని శరత్ అంటాడు. ముందు మీ ముందు మీరంతా అక్క చెల్లెలు అన్నదమ్ములు లాగా కలిసి ఉండాలని మేము అనుకుంటున్నాము అని జగదంబ అంటుంది. ఏమి నాకు అర్థం కావట్లేదు ఇదంతా ఏంటి అని గౌతమ్ అంటాడు.
మల్లి నిజం చెప్పబోతుండగా ఇక ఆపు మల్లి పాత విషయాలను తవ్వుకోవడం అవసరమా అని మాలిని అంటుంది. నీ గతం నాకు అనవసరం మల్లి నువ్వు నాకు దొరకడం నా అదృష్టం అని గౌతమ్ అంటాడు. ఇంతలో ముత్తైదులు వస్తారు పూజ మొదలు పెడదామా అని మీరా అంటుంది.నువ్వు కూడా వచ్చి పూజలో కూర్చో మాలిని అని వాళ్ల నాయనమ్మ అంటుంది. నేనెందుకు నాకేమైనా కొత్తగా పెళ్లి అయ్యిందా అని మాలిని అంటుంది. ఈ పూజలో ఎవరైనా కూర్చోవచ్చమ్మ అయినా మీరిద్దరూ అక్క చెల్లెలు లే కదా అని ముత్తైదువుల్లో ఒకరు అంటారు. ఇదేంటి బయటి నుంచి వచ్చిన వాళ్లు కూడా కూతురు అల్లుడు అంటున్నారు అని గౌతమ్ అనుకుంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!