CM YS Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ని నోబెల్ గ్రహీత, ఫ్రెంచ్ – అమెరికన్ ఆర్ధిక వేత్త ఎస్తేర్ ఢప్లో కలిశారు. తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆమె సోమవారం జగన్ కలిశారు. ఈ సందర్భంగా ఆమెను సీఎం జగన్ దుశ్సాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేసి అభినందనలు తెలియజేశారు. అభిజిత్ బెనర్జీ, మైఖెేల్ క్రీమెర్ తో కలిపి ఎస్తేర్ డఫ్లో 2019 లో ఆర్ధిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని అందుకున్నారు. అబ్దుల్ లతీఫ్ జమీల్ పావర్టీ యాక్షన్ ల్యాబ్ (జే – పాల్) కి సహా వ్యవస్థాపకురాలిగా ఆమె వ్యవహరిస్తున్నారు. సీఎం జగన్ తో భేటీ అనంతరం ఎస్తేర్ డఫ్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో ,సమావేశమైయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, తీరు తెన్నులను ఎస్టేర్ డఫ్లోకు అధికార యంత్రాంగం వివరించింది.
అనంతరం ఎస్టేర్ ఢప్లో మీడియాతో మాట్లాడుతూ సీఎంతో నిర్మాణాత్మకంగా చాలా చక్కటి సమావేశం జరిగిందన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న మంచి కార్యక్రమాల గురించి తెలుసుకున్నామన్నారు. వివిధ అంశాలపై భవిష్యత్తులో వారితో కలిసి పనిచేయడంపైనా దృష్టిపెడతామని చెప్పారు. పేదల అభ్యున్నతి కోసం చేస్తున్న కార్యక్రమాలను సీఎం వివరించారని అన్నారు. వారి కనీస అవసరాలను తీర్చడానికి, సుస్థిర ఆర్థిక ప్రగతికోసం, చేపడుతున్న కార్యక్రమాల గురించి చెప్పారన్నారు. ఇదే సందర్భంలో తన స్వీయ అనుభవాలనుకూడా సీఎం మాతో పంచుకున్నట్లు తెలిపారు. పేదరికాన్ని నిర్మూలించి ప్రజల జీవన స్థితిగతులను పెంచడమనే లక్ష్య సాధనలో వారితో కలిసి పనిచేస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అమలు చేస్తున్న పథకాలు విశేషంగా ఆకట్టుకున్నాయన్నారు. వివిధ అంశాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కున్న పరిజ్ఞానం తమను అకట్టుకుందని తెలిపారు. గడచిన 15 ఏళ్లుగా వివిధ రంగాల్లో జె–పాల్ పనిచేస్తోందనీ, ఇప్పటికే 20 రాష్ట్రాల్లో పనిచేస్తున్నామన్నారు. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్లో పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని అంశాల్లో పనిచేస్తున్నామన్నారు.