Pawan Kalyan: ఏపికి భవిష్యత్తులో మంచి రోజులు వచ్చే దిశగా ప్రధాని మోడీతో భేటీ ఫలప్రదం అయ్యిందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రదాని నరేంద్ర మోడీతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎనిమిదేళ్ల తర్వాత ప్రధానిని కలవడం ఇదే ప్రధమం అని పవన్ తెలిపారు. ఇది ప్రత్యేక పరిస్థితుల్లో జరిగిన సమావేశం అని చెప్పారు. రెండు రోజుల క్రితం ప్రధాన మంత్రి కార్యాలయం నుండి ఫోన్ చేసి విశాఖలో మోడీని కలిసేందుకు రావాల్సిందిగా ఆహ్వానించారని చెప్పారు.
ఈ సందర్భంలో ప్రధాని మోడీ అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారని, ఏపి ప్రజలు బాగుండాలని, తెలుగు ప్రజలు అందరూ ఐక్యంగా ఉండాలని అభిలషించారని పవన్ వివరించారు.తనకు అవగాహన ఉన్న మేరకు ప్రధాని అడిగిన విషయాలు తెలియజేశానని చెప్పారు పవన్ కళ్యాణ్. అయితే ఇటీవల విశాఖలో జరిగిన పరిణామాల గురించి ప్రధాని మోడీతో మాట్లాడారా అని మీడియా అడిగిన ప్రశ్నకు పవన్ సమాధానం దాటవేశారు. అవన్నీ తర్వాత తెలియజేస్తానని పవన్ పేర్కొన్నారు. మోడీతో జరిగిన ఈ కీలక భేటీలో పవన్ తో పాటు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా హజరైయ్యారు.
మీడియాతో జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు
Live Link: https://t.co/vY9uKiXXtt
— JanaSena Party (@JanaSenaParty) November 11, 2022