Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రులు పలువురు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. సినీ పరిశ్రమకు సంబంధించి ఏపి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఎండగడుతూ పవన్ కళ్యాణ్ రీసెంట్ గా సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ మువీ ప్రిరిలీజ్ ఫంక్షన్ నందు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఏపి మంత్రులు తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. పవన్ వ్యాఖ్యలను ఖండిస్తూ ఘాటుగా విమర్శలు గుప్పించారు ఏపి మంత్రులు. మంత్రులు పేర్ని నాని, బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్, అనిల్ కుమార్ యాదవ్ లు తీవ్ర స్థాయిలో పవన్ పై విరుచుకుపడ్డారు. అయితే వీరి విమర్శలపై పవన్ కళ్యాణ్ అదే రీతిలో విమర్శలు సంధించకుండా తన దైన స్టైల్ లో కవిత రూపంలో వ్యంగ్యాన్ని ప్రదర్శించారు.
“తుమ్మెదల ఝుంకారాలు, నెమళ్ల క్రేంకారాలు, ఏనుగుల ఘీంకారాలు, వైసీపీ గ్రామ సింహాల గోంకారాలు సహజమే” అంటూ వ్యంగంగా ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా కరీబియన్ మ్యూజిక్ బ్యాండ్ బహో మెన్ అలపించిన హు లెట్స్ ద డాగ్స్ అవుట్ ( ఈ కుక్కలను బయటకు వదలింది ఎవరు?) అనే పాట వీడియోను కూడా పవన్ కళ్యాణ్ ట్యాగ్ చేశారు. ఈ పాట తనకు ఎంతో ఇష్టమైన పాటల్లో ఒకటి అని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్.
కాగా ఈ ట్వీట్ పై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య స్పందిస్తూ పవన్ కళ్యాణ్ గారు మీరు రాజకీయంగా బాగా పరిణితి చెందారు అంటూ ప్రశంశించారు. ప్రత్యర్ధుల బూతు పురాణాలకు స్పందించకుండా వారి అసభ్య పదజాలాన్ని జంతువుల ఘీంకారాలతో పోల్చి చావు దెబ్బ కొట్టారంటూ కొనియాడారు. మరి ఈ బూతు ప్రవచనా శ్రేష్టులకు మీ కవి హృదయం అర్ధం అవుతుందా నట శ్రేష్టా అని సందేహం వ్యక్తం చేశారు వర్ల రామయ్య. మన రాష్ట్రాన్ని ప్రస్తుతం ఆ దేవుడే కాపాడాలని వర్ల రామయ్య పేర్కొన్నారు.