Pawan kalyan : విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఆ దిశగా అడుగులు వేస్తుంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో మొదలై 32 మంది బలిదానాలు, వందలాది మంది నిర్భందాలు, లక్షలాది మంది ఆందోళనలు త్యాగాల ఫలితంగా విశాఖ ఉక్కు కర్మాగారం ఆవిర్భవించింది. 22 వేల ఎకరాలలో విస్తరించి 17వేల మంది పర్మినెంట్, 16వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులతో పాటు సుమారు లక్ష మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తోంది ఈ కర్మాగారం. యాజమాన్య హక్కులను పూర్తిగా వదులుకోవడానికి కేంద్రం సిద్ధపడటం పట్ల రాజకీయ పక్షాలు, ఉద్యోగులు, కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Pawan kalyan : ఎవరు ఆందోళన చేసినా ఆగదు
విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి స్పందించారు. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయడాన్ని ఆయన సమర్థించారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ లో పెట్టుబడులు పెంచేందుకే విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రవేటీకరణ చేస్తున్నారని అన్నారు. స్టీల్ ప్లాంట్ పై ప్రభుత్వం వ్యాపారం చేయకూడదనే ఈ నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై విపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నారని తెలిపారు. దీనిపై టీడీపీ, వైసీపీ ఆందోళనలు చేసినంత మాత్రాన ఆగదని కూడా తెలిపారు. ప్లాంట్ విశాఖలోనే ఉంటుందని, వేరే దేశానికి తరళివెల్లడం లేదని సుజనా చౌదరి వ్యాఖ్యానించారు.
మోడీకి పవన్ వినతి
అయితే బీజెపీకి మిత్రపక్షమైన జనసేన నేత పవన్ కళ్యాణ్ మాత్రం విశాఖ ఉక్క పరిశ్రమను ప్రైవేకరణ చేయడానికి వీలులేదని అంటున్నారు. దీనిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిసి కూడా మాట్లాడతానని అన్నారు. తెలుగు వారి ఆత్మగౌరవానికి, ఆకాంక్షలకు ప్రతీక అయిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నుండి పెట్టుబడులు ఉపసంహరించుకోవడం బాధాకరమని అన్నారు పవన్ కళ్యాణ్, ఎందరో త్యాగాల ఫలితంగా ఆవిర్భవించిన ఈ కర్మాగారం చేతులు మారుతుందంటే తెలుగు వారందరికీ ఆమోదయోగ్యం కాదని అన్నారు. యుపిఏ పక్షాన ప్రధాన మంత్రిగా మన్మోహన్ సింగ్ ఉన్న సమయంలోనే ప్రవేటీకరణ అడుగులు పడ్డాయన్నారు. ఈ విషయంలో జన సేన తన వంతు కృషి చేస్తుందన్నారు ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాల్సిందిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజెపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా లను కోరుతున్నానని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఢిల్లీకి వెళ్లి నేరుగా వారిని కలిసి మరీ తెలుగు వారి పక్షాన విజ్ఞాపనను కూడా సమర్పించనున్నట్లు వెల్లడించారు.
ఇది కూడా చదవండి :Visakha Steel : అతను బయటకొచ్చాడు..అమ్మో ఎందుకొచ్చాడో అని కంగారు పడుతొన్న జగన్?