Nandigama (NTR): ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం అందరు ఉద్యోగులకు, పెన్షన్లకు ప్రతి నెలా ఒకటవ తేదీన జీతాలు చెల్లించడం లేదు. డీఏ బకాయిలు, పీఆర్సీ ఏరియల్స్ ఇవ్వడం లేదు. దీంతో ఉద్యోగులు, పెన్షనర్లు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున అమలు చేస్తుండటంతో ఉద్యోగులకు, పెన్షనర్లకు సకాలంలో జీతాలు, బకాయిలను ఇవ్వలేకపోతున్నది. ఈ నేపథ్యంలో నందిగామ పెన్షనర్ల సంఘ కార్యాలయంలో సంఘ అధ్యక్షుడు ఉమా మహేశ్వర గుప్త అధ్యక్షతన జరిగిన నెలవారి సమావేశములో ప్రతినెల 1వ తారీఖు నాడే పెన్షన్లు మంజూరు చేయుటలో ప్రభుత్వము అలసత్వము ప్రదర్శించుచున్నందుకు తమ అభిశంసన తెలియచేస్తున్నామని పెన్షనర్లు అందరూ ముక్తకంఠంతో నినదించారు. పెన్షనర్లకు అన్ని డిఏ బకాయిలు , పిఆర్సీ ఎరియర్సు మరియు ప్రక్క రాష్ట్రంలో ఇస్తున్న విధంగా క్వాంటం కూడా అదే రేట్ల ప్రకారం ఇవ్వాలని కోరారు.
ప్రభుత్వము శ్రద్ధ తీసుకొని వృద్ధుల యొక్క అవసరాలను మదిలో ఉంచుకొని ప్రతి నెల ఒకటవ తారీఖు నాడు పెన్షన్లు పడే విధముగా ఏర్పాటు చేయాలని మరియు బకాయిలను వెంటనే విడుదల చేసి వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారికి వైద్య పరమైన అవసరాలకు తోడ్పాటు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సంఘ కార్యదర్శి కె వి ఎస్ ప్రసాదు, కోశాధికారి వియసార్కే ప్రసాదు, మాధవరావు, సుదర్శనం, నారాయణ, వీరాస్వామి, రామశేషయ్య, కాసిం కృష్ణ ప్రసాద్, తదితర పెన్షనర్లు పాల్గొని వారి ఆవేదనను తెలియజేశారు.
Breaking: మణిపూర్ హింసపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..మహిళా జడ్జితో దర్యాప్తునకు సిట్ ఏర్పాటు