Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలను ఆగష్టు 16 నుండి 19వ తేదీ వరకు ఈ – వేలం వేయనున్నారు. ఈ మేరకు టీటీడీ పత్రికా ప్రకటన విడుదల చేసింది. కొత్తవి/ఉపయోగించిన/పాక్షికంగా దెబ్బతిన్న వస్త్రాలు 194 లాట్లు ఉన్నాయి. ఇందులో పాలిస్టర్, కాటన్ పంచలు, క్లాత్ బిట్స్, హుండీ గల్లేబులు, పవిత్రాలు, బ్లౌజ్పీస్లు, ఉత్తరీయాలు, టర్కీ టవళ్లు, లుంగీలు, శాలువలు, బెడ్షీట్లు, దిండుకవర్లు, పంజాబి డ్రెస్ మెటీరియల్స్, జంకాళం కార్పెట్లు, దుప్పట్లు, కర్టన్లు, గర్భగృహ కురాళాలు, బంగారు వాకిలి పరదాలు, కాకి పరదాలు ఉన్నాయన్నారు.
ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో గానీ, టీటీడీ వెబ్సైట్ www.tirumala.org / www.konugolu.ap.govt.in సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.
Nandigama (NTR): ఏపీ సర్కార్ కు పెన్షనర్లు అభిశంసన