Revanth Reddy : రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్. తెలంగాణలోని ఫైర్ బ్రాండ్ నేతల్లో ఆయన ఒకరు. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి చేపట్టిన రాజీవ్ రైతు భరోసా దీక్ష కాస్తా పాదయాత్రగా మార్పు చెందింది. అచ్చంపేట నుంచి హైదరాబాద్కు రేవంత్ పాదయాత్ర కొనసాగుతోంది. నేడు ముగింపు సభ జరగనుంది. అయితే, ఈ సభ లో రేవంత్ ఫ్యూచర్ ఏంటో తేలిపోయింది.
కాంగ్రెస్ రెండుగా చీలిందా? Revanth Reddy
రేవంత్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చురుగ్గా ఉన్న నాయకుడు. ఎలాంటి సమస్యనైనా ప్రభుత్వాన్ని నిలదీసే సత్తా ఉన్న నాయకుడుగానే కాకుండా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను బహిరంగంగా ఎండగడుతున్నారు. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి పాదయాత్ర ఆ పార్టీ సీనియర్లకు రుచించడంలేదు. దీక్షను యాత్రగా మలిచినప్పటినుంచి వారు ఆగ్రహంతో ఉన్నారు. పాదయాత్ర సాకుతో రేవంత్ పార్టీపై పట్టుసాధించే అవకాశాలు లేకపోలేదని రేవంత్ను ఎదగనీయకుండా పొగపెట్టి బయటకు నెట్టేలా ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. రేవంత్ రెడ్డి నేతృత్వంలో రావిరాలలో జరుగుతున్న రాజీవ్ రైతు రణభేరి సభపైనే అందరి దృష్టి నెలకొంది. ఈ సభ జరిగిన తీరును చూసి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిందని అంటున్నారు.
నాగార్జునసాగర్ ఎన్నిక గురించి ….
రేవంత్ రెడ్డి సభకు రేవంత్, నాన్ రేవంత్ వర్గాలుగా నేతలు విడిపోయారని చెప్తున్నారు. రేవంత్ సభకు కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, కుసుమకుమార్, మాజీ ఎంపీలు సురేష్ షట్కర్, సిరిసిల్ల రాజయ్య, మల్లు రవి, పరిగి మాజీ ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి, మాజీ మంత్రి చిన్నారెడ్డి, కొండా సురేఖ, సంబాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎమ్మెల్యేలు గంగారాం, మల్రెడ్డి రంగారెడ్డి, కూన శ్రీశైలం గౌడ్, విజయ రమణా రావు, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్, అనిల్ కుమార్ యాదవ్ హాజరయ్యారు.నాగార్జున సాగర్ ఎన్నికలో ఈ పరిణామాలు ప్రభావం చూపనున్నట్లు అంచనా వేస్తున్నారు.