NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Chandrababu Arrest: రేపు సుప్రీంలో తీర్పు .. ఆ అధికారులతో జగన్ అత్యవసర భేటీ..!

Chandrababu Arrest: టీడీపీ అధినేత చంద్రబాబు గత 40 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్ లో ఉన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును గత నెల 9వ తేదీన ఏపీ సీఐడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో సుప్రీం కోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్, ఫైబర్ గ్రిడ్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ పై శుక్రవారం తీర్పులు వెల్లడి అయ్యే అవకాశం ఉన్నట్లుగా న్యాయవాద వర్గాలు భావిస్తున్నాయి. క్వాష్ పిటిషన్ కు సంబంధించి ఇప్పటికే పలు దఫాలుగా ఇరు పక్షాలు వాదనలు విన్న దర్మాసనం బుధవారంతో వాదనలు ముగించి తీర్పు రిజర్వు చేసింది.

శుక్రవారం క్వాష్ పిటిషన్, ముందస్తు బెయిల్ పై ఉత్తర్వులు రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ  తరుణంలో సీఎం వైఎస్ జగన్ పలువురు ఉన్నత స్థాయి అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. డీజీపీ కసిరెడ్డి రాజేంద్ర నాథ్ రెడ్డి, అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్ రెడ్డి తో పాటు మరి కొందరు అధికారులతో సీఎం జగన్ సమీక్ష జరిపారు. సీఎం జగన్ అధికారులతో ఈ తరుణంలో ఏఏజీ డీజీపీతో సమీక్ష నిర్వహించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సమావేశంలో చంద్రబాబుకి అనుకూలంగా తీర్పు వస్తే ఏమి చేయాలి అనే అంశంపై చర్చ జరిగినట్లుగా తెలుస్తొంది. ఇప్పటికే రాష్ట్రంలో పలు ఆంక్షలు కొనసాగుతున్నాయి. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని రోజుల పాటు 144 సెక్షన్ విధించాలని భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.

ఒక వేళ చంద్రబాబు విడుదల అయితే ఆ పార్టీ శ్రేణులు రోడ్డు షోలు, ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహించే అవకాశం ఉన్నందున వాటిపై కఠిన ఆంక్షలు విధించాలని భావిస్తున్నారుట. రాష్ట్రంలో శాంతి భద్రతల విఘాతం కలగకుండా చూసుకోవడం, ప్రజలు రోడ్డు మీదకు రాకుండా నిలువరించడం లాంటి అంశాలపై డీజీపీతో చర్చించారని ప్రచారం జరుగుతోంది. డీజీపీతో పాటు ఏఏజీతో కూడా సమీక్ష జరపడంతో న్యాయపరమైన అంశాలపైనా చర్చించారని అంటున్నారు. చంద్రబాబు ఆరోగ్యం, భద్రతపై కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఈ అంశాలపైనా ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన విషయాలపైనా చర్చించి ఉండవచ్చని అనుకుంటున్నారు.

కాగా, చంద్రబాబు రిమాండ్ గడువు  గురువారం (19వ తేదీ)తో ముగియడంతో ఆయనను వర్చువల్ గా ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంలో న్యాయమూర్తి .. ఆరోగ్య విషయాలపై ఆరా తీశారు. ఈ సందర్భంలో తన ఆరోగ్య సమస్యలతో పాటు జైలులో తన భద్రత విషయంలో అనుమానాలు ఉన్నాయని న్యాయమూర్తి దృష్టికి తీసుకువచ్చారు. అనుమానాలు ఉంటే వ్రాతపూర్వకంగా ఇవ్వాలని ఆయనకు న్యాయమూర్తి సూచించారు. చంద్రబాబు రాసే లేఖను తనకు సీల్డ్ కవర్ లో అందించాలని జైలు అధికారులకు న్యాయమూర్తి ఆదేశించారు. అనంతరం చంద్రబాబు రిమాండ్ ను నవంబర్ 1వ తేదీ వరకూ పొడిగిస్తున్నట్లు న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.

CM YS Jagan: విజయ దశమి శుభాకాంక్షలుగా అర్చకులకు ఏపీ సీఎం జగన్ గుడ్ న్యూస్

Related posts

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju