YS Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పెద్ద మనసు గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఏపీలో కరోన కేసులు టెన్షన్ పెడుతున్నాయి. సచివాలయంలో సైతం కలకలం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించాలని కోరుతూ ప్రభుత్వానికి సచివాలయ ఉద్యోగుల సంఘం వినతి పత్రం సమర్పించింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులు భావోద్వేగానికి గురయ్యారు. దీంతో ఇప్పుడు అందరి చూపు సీఎం జగన్ పై పడంది.
వాళ్లు ఏం కోరుకుంటున్నారంటే…
సచివాలయ సంఘం ప్రధాన కార్యదర్శి నాప ప్రసాద్ మాట్లాడుతూ వర్క్ ఫ్రం హోంకు అవకాశం ఇవ్వాలని సీఎస్సును కోరామని అన్నారు. సచివాలయం ఉద్యోగులు నలుగురు చనిపోయారని, గతేడాది కోవిడ్ బారిన పడి ఇద్దరు ఉద్యోగులు చనిపోయారని ఈ మూడు రోజుల్లో నలుగురు చనిపోయారని అన్నారు. సచివాలయ ఉద్యోగులమైన మేమంతా భయపడుతున్నామన్న ఆయన 40-50 మంది ఉద్యోగులు హోం ఐసోలేషనులో ఉన్నారని అన్నారు. సచివాలయ సంఘం ప్రధాన కార్యదర్శి సుజాత మాట్లాడుతూ ఉద్యోగులమంతా భయాందోళనతో ఉన్నామని, కరోనా సెకండ్ వేవ్ దారుణంగా ఉందని అన్నారు. పద్మారావు అనే ఉద్యోగిని మూడు ఆస్పత్రులకు తీసుకెళ్లాల్సి వచ్చిందని, ఎటువంటి లక్షణాలు కన్పించకుండానే కోవిడ్ సోకుతోందని అన్నారు. వివిధ ప్రాంతాల వాళ్లు కూడా సచివాలయానికి వస్తారని మరో ఉద్యోగిని కోల్పోకుండా వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించాలని కోరారు.
ప్రభుత్వం ఏం చేయాలి?
కోవిడ్ మహమ్మారి వల్ల నలుగురు ఉద్యోగులు కన్నుమూశారు. వర్క్ ఫ్రం హోం అవకాశం ఉంటే కొంతవరకైనా కరోనా వ్యాప్తిని కట్టడి చేయవచ్చన్నది వారి భావన. కోవిడ్ సోకిన ఉద్యోగులు ఎక్కడికి వెళ్లాలో కూడా అర్ధం కాని పరిస్థితి ఉందని, ఉద్యోగుల కోసం ప్రత్యేక ఆస్పత్రులు ఏర్పాటు చేయాలని సైతం వారు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ సచివాలయ ఉద్యోగుల పట్ల ఉదారంగా స్పందించాలని పలువురు పేర్కొంటున్నారు.