YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గొప్ప మనసును తెలియజేసే నిర్ణయాల్లో తాజాగా ప్రకటించినంది మరో కీలకమైన అంశమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్రత కొనసాగుతోంది. రోజు రోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్ లో కొవిడ్ మరణాల సంఖ్య కూడా అదే స్థాయిలో ఉంది. ఇలాంటి సమయంలోనే మృతుల అంత్యక్రియలకు సంబంధించి సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2021-22 ఏడాదికి గాను కొవిడ్ మృతుల అంత్యక్రియలకు రూ.15 వేలు చొప్పున ఆర్థికసాయం అందించాలని నిర్ణయించారు.
ఆదేశాలు వచ్చేశాయి…
కోవిడ్ మృతుల అంత్యక్రియలకు రూ.15 వేలు చొప్పున ఆర్థికసాయం అందించాలన్న నిర్ణయానికి సంబంధించి ఏపీ ప్రభుత్వ ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ పేరిట ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు అధికారాలు మంజూరు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కొవిడ్ నియంత్రణ, సహాయ చర్యలకు కేటాయించిన నిధుల నుంచి ఈ ఆర్థికసాయం అందజేయాలని కలెక్టర్లకు సూచించారు. ఏపీ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఈ నిధులను ఆయా జిల్లాల కలెక్టర్లకు విడుదల చేస్తారని వివరించారు.
భారీగా కేసులు….
ఇదిలా ఉండగా ఏపీలో కొత్తగా రాష్ట్రంలో 94,550 శాంపిల్స్ టెస్ట్ చేయగా… 24,171 మందికి వైరస్ సోకినట్లు తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 14,35,491కి చేరింది. తాజాగా 101 మంది వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు. ఫలితంగా ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 9,372కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 2,10,436 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది.
జిల్లాల వారీ లెక్కలు ఇవి…
అనంతపురం జిల్లాలో 14 మంది, విశాఖలో 11, చిత్తూరులో 10, తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణ, విజయనగరం జిల్లాల్లో 9 మంది, నెల్లూరులో ఏడుగురు, కర్నూలు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ఆరుగురు, పశ్చిమగోదావరిలో ముగ్గురు ,కడప జిల్లాలో ఇద్దరు చొప్పున మహమ్మారి బారినపడి కన్నుమూశారు. కొత్తగా 21,101 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,79,75,305 నమూనాలను పరీక్షించినట్లు