NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

జగన్ ప్లాన్ అదిరింది బాసు.. ఎమ్మెల్సీల కేటాయింపులో అంతరార్థం ఇదే..!!

శాసనమండలిలో ఖాళీలను భర్తీ చేసే క్రమంలో వైసిపి అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. తాజాగా ఎమ్మెల్సీల కేటాయింపును చూస్తే ఆయన ఎంత పరిశీలన చేసి, ఎంత లోతుగా విశ్లేషించుకుని ఇస్తున్నారా అనేది అర్థం అవుతుంది. సామాజిక వర్గాలు, ప్రాంతాలు, రాజకీయ సమీకరణాలు అన్ని బేరీజు వేసుకుని చాలా పకడ్బందీతో భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని చూసుకుని ఇస్తున్నారు. చిలకలూరిపేట వైసీపీ మాజీ ఇంచార్జి మర్రి రాజశేఖర్ కు ఒకటి ఖరారైనట్టు మాటలు వినిపిస్తున్నాయి. ఇదే సందర్భంలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కొయ్యే మోషేన్ రాజుకు కూడా మరో ఎమ్మెల్సీ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ రెండింటితో పాటు రాయలసీమకు చెందిన ఒక మైనార్టీ నాయకుడికి కూడా ఎమ్మెల్సీ కేటాయిస్తారని అంటున్నారు. అంటే మూడు ఎమ్మెల్సీలు మూడు భిన్న వర్గాలకు ఇవ్వడం ద్వారా జగన్ ఏం చెప్ప దల్చుకున్నారో పకడ్బందీగా అర్థమవుతుంది. తన సొంత సామజిక వర్గం కాకుండా ఇతరులకు ఇవ్వడం ద్వారా జగన్ అంతర ఉద్దేశం ఏమిటి అన్నది చెప్పకనే చెప్పారు.

మర్రి రాజశేఖర్ 2014లో తరువాత నుంచి చిలకలూరిపేట నియోజకవర్గానికి వైసీపీ ఇంచార్జి గా ఉన్నారు. నాడు అధికార పార్టీ టిడిపిని తట్టుకుని ఆ నియోజకవర్గంలో పార్టీని కొంత మేర నిర్మాణం చేశారు. ఈ నేపథ్యంలో లోనే ఎన్నికలకు ఏడాది ముందు దూసుకొచ్చిన పార్టీలో చేరి టికెట్ సంపాదించుకున్న విడుదల రజిని ఎమ్మెల్యే గెలిచి పెత్తనం చలాయిస్తున్నారు. ఆ నియోజకవర్గంలో జగన్ కంటే, పార్టీ కంటే తానే ముఖ్యం, తనదే అంతా హవా అన్నట్లు విడుదల రజిని ప్రవర్తన ఉంటోంది. ఒక్కో సారి ఆమె సమావేశాల్లోనూ, బయట కూడా జగన్ ఫోటో, పార్టీ సింబల్ లేకుండా వ్యక్తిగతంగా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శలు ఉన్నాయి. వేటినంటిని గమనించిన పార్టీ పెద్దలు.. ఆమె హవాకు చెక్ పెట్టి క్షేత్ర స్థాయిలో పార్టీ నిర్మించిన మర్రి రాజశేఖర్ కు కూడా పెద్ద ఇస్తే బాగుంటుందని యోచనకు వచ్చినట్లు తెలుస్తుంది. దీంతో పాటు రాష్ట్ర స్థాయిలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకులకు ప్రాధాన్యత ఇస్తే జగన్ కు కమ్మ వ్యతిరేకి అనే భావన కూడా పోతుంది. అటు నియోజకవర్గంలో కూడా కమ్మ సామాజిక వర్గం ఓటర్ల ప్రాధాన్యత ఎక్కువగా ఉండటంతో మర్రి రాజశేఖర్ ను ఎంపిక చేసినట్టు వైసీపీలో అంతర్గత సంబంధం జరుగుతుంది. ఇటు స్థానిక రాజకీయ పరిస్థితులు, అటు ఎమ్మెల్యే పెత్తనం కొంత తగ్గించడం, రాష్ట్ర స్థాయిలో సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నామని సంకేతాలు పంపించడం ఇలా బహుముఖ వ్యహంతో మర్రి రాజశేఖర్ ను ఎంపిక చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని పక్కన పెడితే..

* పశ్చిమగోదావరి జిల్లాలోని వైసిపి సీనియర్ నాయకులు కొయ్య మోషేన్ రాజుకు ఎమ్మెల్సీ కేటాయిస్తున్నారు అని ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే ఇది కూడా జగన్ పక్కా వ్యూహాత్మక స్టెప్ అనే అనుకోవాలి. మోషేన్ రాజు వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో కీలకంగా పనిచేస్తున్నారు. 2012 నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో కొవ్వూరు నుంచి పోటీ చేసేందుకు వైసీపీ టిక్కెట్ ఆశించి భంగపడ్డారు.టికెట్ దక్కకపోవడంతో అప్పటికప్పుడు టిడిపిలో చేరి పోయారు. టిడిపిలో చేరి మళ్ళీ రెండు నెలలు కూడా గడవకముందే వైసీపీ లో జాయిన్ అయ్యారు. అప్పటి నుండి పార్టీకి చురుకుగా పనిచేస్తున్నారు.అటు పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పార్టీ క్షేత్ర స్థాయి నిర్మాణంపై దృష్టి పెట్టి తన సామాజికవర్గం (ఎస్ సీ) కూడా పార్టీ పట్ల ఆకర్షితులయ్యేలా బాగా క్షేత్ర స్థాయిలో పని చేశారు. ముఖ్యంగా రిజర్వ్డ్ నియోజకవర్గాలైన గోపాలపురం, కొవ్వూరు ప్రాంతాల్లో ఎక్కువగా తిరిగారు. పార్టీలో తొమ్మిదేళ్ల నుంచి ఉండడం, ఇప్పటి వరకు ఆశించినంత గుర్తింపు దక్కక పోవడంతో ఇటీవల తన అంతర్గత సంభాషణల్లో అసంతృప్తి బయటపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న అధినేత జగన్ పిలిపించి మాట్లాడి ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చి ఆ హామీ మేరకు ఇప్పుడు అతను కేటాయిస్తున్నారు. ఇక్కడ కూడా ఆ జిల్లాలో ఆ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు ఉండడం, తొమ్మిదేళ్లుగా పార్టీకి అందించిన సేవలకు గుర్తింపు ఇవ్వడం అన్ని కూడా వ్యూహాత్మకంగానే కూడా జరిగాయి.

వీరిద్దరితో పాటు మరో మైనారిటీ నాయకులు కూడా ఎమ్మెల్సీ ఇవ్వడం ద్వారా జగన్ ఒక రకంగా మంచి పని చేస్తున్నారనుకోవాలి. ఒకరికి కమ్మ, మరొకరికి ఎస్సీ, ఇంకో మైనారిటీ కి మూడు ఎమ్మెల్సీలు కేటాయించి తాను అన్ని సామాజిక వర్గాలకు సమ న్యాయం చేస్తానని, తన సొంత సామాజిక వర్గానికే కేటాయిస్తున్నారన్న అపవాదు పోగొట్టుకునే క్రమంలోనే జగన్ ఇటువంటి అడుగులు వేస్తున్నారు.

Related posts

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju