తెలుగు సినిమా రంగంలో “ఆచార్య” సినిమా రిలీజ్ అవ్వకముందు వరుస పెట్టి బ్లాక్ బస్టర్ విజయాలు కలిగిన డైరెక్టర్ గా కొరటాల శివకి మంచి పేరుంది. “ఆచార్య” రాకముందు వరకు కొరటాల తరపు ఎక్కించిన నాలుగు సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులు సృష్టించాయి. కాని చిరంజీవి, రామ్ చరణ్ తో కలిసి తెరకెక్కించిన “ఆచార్య” దారుణంగా బాక్సాఫీస్ దగ్గర చతికలపడింది. భారీ అంచనాల మధ్య ఏప్రిల్ నెలలో విడుదలైన “ఆచార్య” కనీసం కలెక్షన్ లు రాబట్టలేకపోయింది.
దీంతో ఇప్పుడు సినిమాకి సంబంధించి సీడెడ్ ప్రాంతాలకు చెందిన డిస్ట్రిబ్యూటర్ లు చాలా నష్టపోవడంతో… కొరటాల శివ ఆఫీస్ ని చుట్టుముట్టడం జరిగిందట. డిస్ట్రిబ్యూటర్లు కొరటాల శివ ఆఫీస్ వద్ద ఆందోళనలు చేస్తున్నారట. పైగా పాండమిక్ రాకముందే సినిమా అమ్మే విషయాలలో కొరటాల శివ హస్తం ఉండటంతో .. దీంతో డిస్ట్రిబ్యూటర్లంతా కొరటాల శివని టార్గెట్ చేసుకుని ఆందోళన నిర్వహిస్తున్నట్లు నష్టం డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.
పైగా ఈ సినిమాకి సంబంధించి నిర్మాణ భాగస్వామ్యంలో కొరటాల స్నేహితుల ఉండటం జరిగింది. దీంతో “ఆచార్య” అట్టర్ ప్లాప్ అష్ట కష్టాలు కొరటాల శివని చుట్టుముట్టినట్లయింది. అంత మాత్రమే కాదు నష్టపోయిన బయ్యర్ లు, ఎగ్జిబిటర్లు… గొడవ చేస్తూ ఉండటంతో పాటు ఇంటర్నెట్ లో “జస్టిస్ ఫర్ కొరటాల శివ” అంటూ ట్రెండ్ చేస్తున్నారు. దర్శకుడిగా కాకుండా సినిమాకి సంబంధించి బిజినెస్ విషయంలో కొరటాల ఇన్వాల్వ్ కావడంతో… నష్టపోయిన ఎగ్జిబిటర్లు, బయ్యర్లు దాదాపు 25 మంది.. కొరటాల ఆఫీస్ వద్ద ధర్నా చేస్తూ వస్తున్నారు. ఫస్ట్ టైం ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్న కొరటానికి “ఆచార్య” బెడిసి కొట్టడంతో తొలి ఎదురుదెబ్బ చాలా గట్టిగానే తగిలినట్టు తాజా పరిణామాలు బట్టి తెలుస్తుంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!