డైలాగ్ కింగ్ మోహన్ బాబు గత నెలలో 45 ఏళ్ళ సినీ ప్రస్థానాన్ని జరుపుకున్నారు. తన తండ్రి ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటు మంచు విష్ణు ట్విట్టర్ వేదికగా ఒక వీడియోను పంచుకున్నారు. తన తండ్రి చరిత్రలో ఎన్నో చిత్రాలు ఘన విజయాన్ని సాధించాయని, వారు మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా, హీరోగా, నిర్మాతగా వ్యవహరించాడని, మొత్తంగా 500 చిత్రాలకు పైగా నటించాడు. తన ఫెవరేట్ మూవీ అయిన అడవిలో అన్న సినిమాలోని వీడియో బైట్ ని విష్ణు పోస్టు చేసి ఈవిధంగా స్పందించాడు.
డైలాగ్ కింగ్ గా పేరుతెచ్చుకున్న నాన్న ఎంతటి డైలాగ్ అయిన అవలోకగా చెప్పుతాడని, తన డైలాగ్ సరళి ఈ తరం యివతకు ఆదర్శమని తెలిపారు. తను డైలాగ్ చెప్పే విధానం ఆ సరళి చూస్తే నాకు అసూయగా ఉంటుందని తెలిపాడు మంచు విష్ణు వర్ధన్. నేటి తరానికి మోహన్ బాబు గారు ఆదర్శమని, తన సరళిని అనుకరించాలని ఈ కాలం యువత ప్రయత్నిస్తుంటారన్నాడు. తాను నటించిన రామన్న చౌదరి, పేదరాయుడు చిత్రాల్లో వారి నటన అద్భుతమని, వారి నటన జీవితం ఈ చిత్రాలు బారి విజయాన్ని అందుకున్నాయి.
మంచు విష్ణు ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. 2007లో శ్రీనువైట్ల దర్శకత్వంలో విడుదలైన ఢీ చిత్రం విష్ణుకు కెరీర్ లో బిగ్గెస్ట్ విక్టరీగా నిలిచిపోయింది. అందుకే ఈ కాంబినేషన్లో ఢీ అంటే ఢీ (డబల్ డోస్) అనే చిత్రం వచ్చే సంవత్సరం ప్లాన్ చేస్తున్నాడు. ఈ చిత్రంతో పాటు ఐటీ స్కాం నేపథ్యంతో తెరకెక్కిన మోసాగాళ్ళు చిత్రంలో కూడా నటిస్తున్నాడు ఈ మంచు వారి అబ్బాయి. ఈ చిత్రం జూన్ లో విడుదల కావాల్సి ఉండగా కరోనా వాళ్ళ పోస్ట్ ఫోన్ అయింది. ఈ చిత్రంలో విష్ణు సరసన కాజల్ నటిస్తుండగా, బాలీవుడ్ యాక్టర్ సునీల్ శెట్టి పోలీస్ ఆఫిసర్ గా నటిస్తున్నాడు.