Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి గత కొన్నాళ్లుగా తీవ్రంగా సినిమాల పరంగా ఫుల్ బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా కరోనా వైరస్ రావడంతో సినీ కార్మికులకు నిత్యావసరాల సరుకులతో పాటు మరిన్ని సహాయ సహకార కార్యక్రమాలు చిరంజీవి దగ్గరుండి చేయించారు. ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సినిమా టికెట్ ధర విషయంలో వ్యవహరిస్తున్న తీరు పట్ల తనదైన శైలిలో స్పందించి.. ప్రభుత్వాల నుండి సానుకూలమైన నిర్ణయాలు రావడంలో కీలక పాత్ర పోషించారు. ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ చాలా మందిని కరోనా సమయంలో చిరంజీవి ఆదుకుని తర్వాత .. సొంత బ్యానర్ లో కొరటాల శివ దర్శకత్వంలో ఒప్పుకున్న “ఆచార్య” సినిమా షూటింగ్ లో బిజీ కావడం తెలిసిందే.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అయితే ఈ సినిమా ఏప్రిల్ నెల 29వ తారీకు విడుదల అయ్యి.. ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇదంతా పక్కన పెడితే దాదాపు రెండు సంవత్సరాలపాటు ఫుల్ బిజీగా ఉన్నా చిరంజీవి “ఆచార్య” విడుదలైన తర్వాత భార్య సురేఖ తో విదేశీ యాత్ర చేపట్టడం తెలిసిందే. గత నెల మూడవ తారీకున సురేఖతో కలిసి విదేశాలకు వెళ్లిన చిరంజీవి దాదాపు నెల రోజుల పాటు హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేయడం జరిగింది. తాజాగా నిన్న జూన్ మూడవ తారీఖు నాడు హైదరాబాద్ కి చేరుకున్నారు. దీంతో ఇప్పుడు చిరంజీవి ఒప్పుకున్న సినిమా షూటింగ్ లను కంప్లీట్ చేసే పనిలో నిమగ్నమయ్యారు.
దీనిలో భాగంగా మోహన్ రాజా దర్శకత్వంలో చేస్తున్న “గాడ్ ఫాదర్” సినిమా షూటింగ్ లో జాయిన్ కానున్నారు. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ తో చేయాల్సిన ఒక సాంగ్ షూట్ ముంబైలో ప్లాన్ చేయటంతో.. అక్కడ షూటింగ్ లో జాయిన్ కానున్నారు. కొరియోగ్రాఫర్ ప్రభుదేవా ఆధ్వర్యంలో ఈ సాంగ్ షూటింగ్ జరగనుంది. ఆ తర్వాత “బోలా శంకర్” షూటింగ్ కోసం మలేషియాకు వెళ్ళనున్నారు. ఇంకొక నెలలో బాబీ దర్శకత్వంలో “వాల్తేరు వీరయ్య” షూటింగ్ కూడా మొదలుపెట్టే ఆలోచనలో చిరంజీవి ఉన్నట్లు ఇండస్ట్రీ టాక్. దాదాపు మూడు సినిమాలను త్వరగా కంప్లీట్ చేసి తరహాలో చిరంజీవి.. రెడీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!