కమల్హాసన్ నిర్మాతగా రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్లో తెరకెక్కించిన చిత్రం `కడారం కొండాన్`. దాన్నే తెలుగులో `మిస్టర్ కెకె`గా విడుదల చేశారు. కమల్హాసన్కు బాగా నచ్చిన రాజేష్ ఎం సెల్వ ఈ సినిమాను తెరకెక్కించారు. విక్రమ్, అభి హాసన్, అక్షర హాసన్ ఈ చిత్రంలో కీలక పాత్రధారులు. మలేషియా నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. కౌలాలంపూర్లో తెరకెక్కినట్టు చూపిస్తారు. ఈ సినిమాను మలేషియన్ సెన్సార్ బోర్డు అడ్డుకుంది. అక్కడ బ్యాన్ చేయడంతో శుక్రవారం ఈ సినిమా అక్కడ విడుదల కాలేదు. ఇంతకు ముందు విజయ్ సేతుపతి `సూపర్ డీలక్స్`ను కూడా మలేషియా లో విడుదల కాలేదు. మలేషియాలో తమిళ సినిమా లవర్స్ ఎక్కువ. వాళ్లు ఈ చిత్రాన్ని సింగపూర్ వెళ్లి చూశారు. మరీ ముఖ్యంగా అక్కడ విక్రమ్కు కూడా ఎక్కువమంది ఫ్యాన్స్ ఉన్నారు. అందువల్ల ఇప్పుడు వారు కూడా సింగపూర్ వైపు పరుగులు తీస్తున్నారు. ప్రపంచంలో అన్ని చోట్లా విడుదలైనా మలేషియాలో సినిమా విడుదల కాకపోవడం ఏంటని కొందరు అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ఇదిలా ఉండగా సినిమా మలేషియాలో విడుదల కాని విషయాన్ని చిత్ర డిస్ట్రిబ్యూషన్ సంస్థ లోటస్ ఫైవ్ స్టార్ తమ ఫేస్బుక్ పేజీలో అధికారికంగా ప్రకటించింది. సెన్సార్ వాళ్లు బ్యాన్ చేయడం మూలంగానే విడుదల చేయలేదని స్పష్టం చేసింది.
previous post
next post