నేటి తరం స్టార్ హీరోలందరూ హీరోగా సినిమాలు చేస్తూనే సినిమాల నిర్మాణంలో భాగమవుతున్నారు. ప్రభాస్, శర్వానంద్, మహేశ్ ఇలా అందరూ వారి సినిమాల నిర్మాణంలో భాగమవుతూ వస్తున్నారు. తాజాగా ఈ లిస్టులోకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేరబోతున్నారని సమాచారం. త్వరలోనే ఎన్టీఆర్ ఓ బ్యానర్ను స్టార్ట్ చేయబోతున్నారట. దాంతో తాను నటిస్తున్న సినిమాల్లో నిర్మాణంలో భాగమయ్యేలా ఆలోచిస్తున్నారట. ఇప్పటికే నేటి తరం నందమూరి హీరోల్లో కల్యాణ్ రామ్కి ఆల్ రెడీ ఓ బ్యానర్ ఉంది. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా స్టార్ట్ చేయబోతున్నాడని టాక్.
Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!