NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవలె `ఆర్ఆర్ఆర్` వంటి బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చిత్రంతో ప్రేక్షకులను పలకరించి.. భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా హిట్తో ఎన్టీఆర్ తన రెమ్యునరేషన్ను పెంచేశారని తాజాగా ఓ టాక్ బయటకు వచ్చి నెట్టింట వైరల్గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్లే.. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో తన 30వ సినిమా చేయబోతున్నాడు.
ఈ ప్రాజెక్ట్ను గత ఏడాది సమ్మర్లోనే ప్రకటించగా.. ఈ సమ్మర్లో సెట్స్ మీదకు వెళ్లబోతోంది. నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై మిక్కిలినేని సుధాకర్, కళ్యాణ్ రామ్ కలిసి హై బడ్జెట్తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. `ఎన్టీఆర్ 30` వర్కింగ్ టైట్తో ఈ మూవీని రూపొందించబోతున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇందులో కియారా అద్వానీ హీరోయిన్గా నటించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాకు ఎన్టీఆర్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ హాట్ టాపిక్గా మారింది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న కథనాలు ప్రకారం.. `ఆర్ఆర్ఆర్` కు రూ. 45 కోట్ల వరకు పారితోషికం అందుకున్న ఎన్టీఆర్.. కొరటాల మూవీకి మాత్రం రూ. 55 కోట్లు పుచ్చుకుంటున్నాడట.
అంటే ఎన్టీఆర్ తన రెమ్యునరేషన్ను పది కోట్లు పెంచాడని ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారం ఎంత వరకు నిజమో వారికే తెలియాలి. కాగా, ఎన్టీఆర్ ప్రస్తుతం ఆంజనేయ స్వామి దీక్షా మాలను ధరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సైతం మొన్నా మధ్య బయటకు వచ్చాయి. అయితే ఎన్టీఆర్ దీక్ష పూర్తయిన వెంటనే కొరటాల శివ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.
Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!