Radhey Shyam: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన “రాధేశ్యాం” మార్చి 11 విడుదల కానున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రభాస్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. పాన్ ఇండియా నేపథ్యంలో రిలీజ్ కానున్న ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. రొమాంటిక్ తరహాలో ప్రేమకథా నేపథ్యంలో ప్రభాస్ ఈ సినిమాలో లవర్ బాయ్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఫస్ట్ టైం ప్రభాస్ సరసన పూజా హెగ్డే లాంటి అందగత్తె నటించడంతో… సినిమా పై మరింత అంచనాలు ఏర్పడ్డాయి. ఇటువంటి తరుణంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పూజా హెగ్డే చేస్తున్న కామెంట్స్ సినిమాపై ఆసక్తిని… పెంచేస్తున్నాయి.
ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాలో లైవ్ మ్యాచ్ కి సంబంధించి పూజా హెగ్డే చేసిన కామెంట్లు ప్రభాస్ అభిమానులను కలవర పెడుతున్నాయి. మేటర్ లోకి వెళ్తే ప్రభాస్ యాక్షన్ సన్నివేశాలలో తిరుగు లేని రీతిలో నటిస్తాడని అందరికీ తెలుసు. కానీ ఈ సినిమాలో క్లైమాక్స్ సన్నివేశం లో ప్రభాస్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ మన ఫ్యాన్స్ కి చాలా కొత్తగా ఉంటుంది. లండన్ లో ఈ సన్నివేశాలు చిత్రీకరించడం జరిగింది. ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ తో… ప్రభాస్ తన యాక్టింగ్ తో… అదరగొట్టేశాడు. కచ్చితంగా ఈ సన్నివేశంలో ప్రభాస్ లో కొత్త నటన యాంగిల్ కనబడుతోంది.. అనే సరికొత్త కామెంట్లు చేయడం జరిగింది.
సినిమాల్లో చివరిలో ప్రభాస్ టైటానిక్ సినిమా తరహాలో చనిపోయే అవకాశం ఉన్నట్లు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నయి. దీంతో ఇదే జరిగితే గనుక ప్రభాస్ కెరీర్లో రాధ శ్యామ్ మరో చక్రం సినిమా అవుతుందేమో అని అభిమానులు కంగారు పడుతున్నారు. ప్రభాస్ కెరియర్ లో అత్యంత దారుణమైన అట్టర్ ఫ్లాప్ సినిమా చక్రం. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా.. భారీ అంచనాల మధ్య విడుదలై… అట్టర్ ఫ్లాప్ అయ్యింది. సినిమాలో చివరిలో ప్రభాస్ చనిపోవడం జరిగింది. దీంతో ఇప్పుడు ఇదే తరహాలో “రాదే శ్యాం” ఉంటుందని వార్తలు వస్తున్న తరుణంలో డార్లింగ్ ఫాన్స్ కంగారు పడుతున్నారు.