బాహుబలితో జాతీయ స్థాయి హీరోగా క్రేజ్ను సొంతం చేసుకున్న హీరో ప్రభాస్ ఆ తర్వాత `సాహో` ఆ సక్సెస్ను కొనసాగించలేకపోయారు. దీంతో ఇప్పుడు చేస్తోన్న `జాన్` సినిమా విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ ఏ సినిమా చేస్తారనే దానిపై పలు వార్తలు వినపడుతున్నాయి. తాజా సమాచారం మేరకు ప్రభాస్ తదుపరి చిత్రాన్ని సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో చేయబోతున్నారట. `అర్జున్ రెడ్డి`తో టాలీవుడ్లోనే కాదు.. బాలీవుడ్లోనూ సూపర్హిట్ అందుకున్న దర్శకుడు సందీప్. ఇప్పుడు బాలీవుడ్లోనే ఓ సినిమా చేస్తున్నారు. దీని తర్వాత ప్రభాస్తో సినిమా చేయబోతున్నారని మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించే అవకాశాలున్నాయని వార్తలు వినపడుతున్నాయి.
previous post
next post
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!