Prabhu Deva: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే ది బెస్ట్ కొరియోగ్రాఫర్ గా… తిరుగులేని డాన్సర్ గా మంచి క్రేజ్ ఉన్న ప్రభుదేవా 2005వ సంవత్సరంలో “నువ్వొస్తానంటే నేనొద్దంటానా” సినిమా తో మెగాఫోన్ పట్టుకోవడం తెలిసిందే. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. సిద్ధార్థ, త్రిష హీరో హీరోయిన్ లుగా తెరకెక్కిన ఈ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో దర్శకుడిగా ప్రభుదేవా వరుస ఆఫర్లు అందుకుని 17 సంవత్సరాల లో… చేసిన సినిమాలలో నాలుగు మాత్రమే హిట్ కావడంతో… ఇప్పుడు మెగా ఫోన్ కి ప్రభుదేవా గుడ్ బై చెప్పినట్లు సమాచారం. చిరంజీవితో శంకర్ దాదా జిందాబాద్, అక్షయ్కుమార్తో రౌడీ రాథోడ్, సల్మాన్ ఖాన్ తో తెరకెక్కించిన రెండు సినిమాలు అట్టర్ ఫ్లాప్ కావడంతో.. పార్టు నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా హిందీలో తెరకెక్కించిన పెద్దగా ఆకట్టుకోలేక పోవడంతో పాటు అంతకుముందు ప్రభాస్ తో చేసిన పౌర్ణమి కూడా డిజాస్టర్ కావడంతో దర్శకుడిగా ఇక సినిమాలు చేయకూడదని మళ్లీ యూ టర్న్ తీసుకొని కొరియోగ్రాఫర్ గా రాణించాలని అనుకుంటున్నారట. అవసరమైతే మళ్లీ నటన పరంగా కూడా కెరియర్ ప్రారంభించాలి అని ఏ మాత్రం సినిమాలు డైరెక్ట్ చేయకూడదని ప్రభుదేవా తాజాగా డిసైడ్ అయినట్లు ఇండస్ట్రీ వర్గాల లేటెస్ట్ టాక్. దర్శకుడిగా సినిమాలు ఒప్పుకున్నా ఒకపక్క కరోనా కారణంగా.. నిర్మాతలతో బేధాభిప్రాయాలు కూడా ఎక్కువ వస్తూ ఉండటంతో ప్రభుదేవా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. సో మొత్తం మీద యూటర్న్ తీసుకుని ప్రభుదేవా ఇప్పుడు కొరియోగ్రాఫర్ లేదా నటుడిగా రాణించాలని అనుకోవటం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!