Radhe Shyam: పాన్ ఇండియా స్థార్ ప్రభాస్ హీరోగా కె.రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `రాధేశ్యామ్`. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్గా నటించగా.. కృష్ణం రాజు, భాగ్యశ్రీ, సత్యారాజ్ కీలక పాత్రలను పోషించారు. గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్లపై రూ. 300 కోట్ల బడ్జెట్తో నిర్మితమైన ఈ సినిమా మార్చి 11న మొత్తం ఐదు భాషల్లో విడుదల చేయబోతున్నారు.
యూరప్ నేపథ్యంలో జరిగే పీరియాడికల్ లవ్స్టోరిగా ఈ సినిమాను రూపొందించారు. ఇందులో విక్రమాదిత్య అనే హస్తసాముద్రికా నిపుణుడిగా ప్రభాస్ కనిపించబోతుండగా.. ఆయన ప్రేయసి ప్రేరణ పాత్రలో పూజా నటించింది. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
నాన్ థియేట్రికల్ బిజినెస్ లెక్కలు ఇంకా తెలీకపోయినా.. థియేట్రికల్ బిజినెస్ మాత్రం చాలా వరకు బడ్జెట్ ను రిటర్న్ తీసుకు వచ్చేసింది. తాజా సమాచారం ప్రకారం.. రాధేశ్యామ్ ఏకంగా రూ. 200 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందట. ఇక ఏరియాల వారీగా లెక్కలు ఇలా ఉన్నాయి.
నైజాం- 36.50 కోట్లు
సీడెడ్- 18 కోట్లు
ఉత్తరాంధ్ర- 13కోట్లు
తూర్పు గోదావరి- 8.80కోట్లు
పశ్చిమ గోదావరి- 7.50కోట్లు
గుంటూరు- 9.90 కోట్లు
కృష్ణ- 7.5 కోట్లు
నెల్లూరు- 4 కోట్లు
—————————————–
ఏపీ+తెలంగాణ- 105.20 కోట్లు
—————————————–
కర్ణాటక- 12.50 కోట్లు
తమిళనాడు- 6 కోట్లు
కేరళ- 2.10 కోట్లు
హిందీ- 50 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా- 3 కోట్లు
ఓవర్సీస్ – 24 కోట్లు
—————————————————————
వరల్ వైడ్ టోటల్ బిజినెస్: 202.80కోట్లు
—————————————————————
మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా రూ. 202.80 కోట్లు బిజినెస్ చేసిన రాధేశ్యామ్.. క్లీన్ హిట్ అవ్వాలంటే రూ. 204 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. మరి ప్రభాస్ ఈ భారీ టార్గెట్ను రీచ్ అవుతాడా..? లేదా..? అన్నది చూడాలి.