HBD Prabhas: ఆదివారం అక్టోబర్ 23వ తారీకు ప్రభాస్ పుట్టిన రోజు నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాలలో జన్మదిన వేడుకలు భారీ ఎత్తున అభిమానులు జరుపుకున్నారు. ఇక ఇదే సమయంలో ప్రభాస్ నటించిన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా వచ్చాయి. ఆది పురుష్, ప్రాజెక్టు కే, సలార్..అప్ డేట్స్ రావడం జరిగింది. ఇక ఇదే సమయంలో ప్రభాస్ నటించిన బిల్లా సినిమాని 4K టెక్నాలజీతో రీ రిలీజ్ చేయడం జరిగింది. అనేక చోట స్పెషల్ షోలు పడ్డాయి. ఈ క్రమంలో తాడేపల్లిగూడెంలో ఓ థియేటర్ లో… అభిమానుల అత్యుత్సాహంతో బాణాసంచ కాల్చడంతో కుర్చీలు తగలబడ్డాయి.
ఈ పరిణామంపై దర్శకుడు రాంగోపాల్ వర్మ తీవ్రస్థాయిలో స్పందించారు. థియేటర్ లో తగలబడిన కుర్చీల వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసి.. అక్కడ జరుగుతున్నది దీపావళి పండుగ కాదు. ప్రభాస్ అభిమానుల పిచ్చి చర్య. అతని సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ నీ తగలబెట్టారు..అని ట్వీట్ చేయడం జరిగింది. మరో ట్వీట్ లో ఇది ప్రభాస్ అభిమానుల స్టైల్.. దీపావళి వేడుక అని ఆర్జీవి పేర్కొన్నారు. దీంతో ప్రభాస్ అభిమానులు ఆర్జీవి చేసిన కామెంట్లకి ఏ విధంగా స్పందించాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది.
ఒక్క తాడేపల్లిగూడెంలో మాత్రమే కాదు తణుకులో కూడా… స్పెషల్ షో పడిన “బిల్లా” సినిమా థియేటర్ లో కుర్చీలు విరగకొట్టడం జరిగిందంట. మెహర్ రమేష్ దర్శకత్వంలో 2009లో వచ్చిన “బిల్లా” ఓ మాదిరిగా పరవాలేదు అనిపించింది. ఈ సినిమాలో కృష్ణంరాజు కీలక పాత్ర పోషించారు. దీంతో దివంగత కృష్ణంరాజు గత నెలలో మరణించడంతో.. ఆయనను స్మరించుకుంటూ ప్రభాస్ జన్మదిన వేడుకలను అభిమానులు ఈ రీతిగా జరుపుకున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!