Bheemla Naayak: “బీమ్లా నాయక్” ప్రీ రిలీజ్ వేడుక అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు సినిమా హీరోలు పవన్, రానా.. హీరోయిన్ సంయుక్త మీనన్ ఇంకా దర్శకులు మ్యూజిక్ డైరెక్టర్లు టెక్నీషియన్లు అందరూ హాజరు కాగా మెయిన్ హీరోయిన్ నిత్యామీనన్ రాకపోవటం చర్చనీయాంశంగా మారింది. “బీమ్లా నాయక్” కంటే డేంజర్ అన్న తరహాలో ట్రైలర్ లో అదరగొట్టే ఫైర్ గా డైలాగులు చెప్పిన నిత్యా మీనన్.. ప్రీ రిలీజ్ వేడుకకు రాకపోవడానికి గల కారణం.. సినిమా యూనిట్ తో బేధాభిప్రాయాలు అన్న టాక్ నడుస్తోంది.
పవన్ కి జంటగా నటించిన నిత్యా మీనన్.. రెమ్యూనరేషన్ విషయంలో భారీగా డిమాండ్ చేయడంతో.. మేకర్స్ నుండి చెప్పిన రెమ్యూనరేషన్ రాకపోవటంతో..బీమ్లా నాయక్ ప్రమోషన్ కార్యక్రమాలకు నిత్య మీనా ఎగనామం పెట్టినట్లు ఇండస్ట్రీ టాక్. ఇందువల్లే సినిమాకి సంబంధించి సోషల్ మీడియాలో కూడా కనీసం రెస్పాన్స్ కాలేదని అంటున్నారు. మరోపక్క బిజీ షెడ్యూల్ కారణంగానే నిత్య ఈ వేడుకకు రాలేదు అన్న టాక్ వినిపిస్తుంది.
ఫిబ్రవరి 21వ తారీకు న జరగాల్సిన ఈ వేడుక సమయంలో ఆ తేదీన రావటానికి నిత్యామీనన్ తన షెడ్యూల్ రెడీ చేసుకున్నట్లు ఈ క్రమంలో ఒక్కసారిగా ఈవెంట్ 23 కి వాయిదా పడటంతో.. అదే సమయంలో ఓ వెబ్ సిరీస్ చేస్తూ ఉండటంతో దానికి సంబంధించిన షూటింగ్ ఉండటంతో.. నిత్యా మీనన్ బీమ్లా నాయక్ రిలీజ్ కార్యక్రమానికి రాలేదన్ని మరి కొంతమంది అంటున్నారు. ఏది ఏమైనా బీమ్లా నాయక్ వేడుకలో మెయిన్ హీరోయిన్ నిత్యామీనన్ కనబడకపోవడం .. సోషల్ మీడియా లో కనీసం సినిమాకి సంబంధించి రెస్పాండ్ కూడా కాకపోవటం అభిమానుల లో చర్చనీయాంశంగా మారింది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!