బాలీవుడ్ స్టార్ సుశాంత్ సూసైడ్ కేసు లో సిబిఐ విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఈ తరుణంలో ఆయన గర్ల ఫ్రెండ్ రియా చక్రవర్తి ని తాజాగా ఐదు గంటల పాటు సిబిఐ అధికారులు విచారణ చేశారు. ముంబాయి లోని డిఆర్డిఓ గెస్ట్ హౌస్ లో రియా చక్రవర్తిని సిబిఐ ప్రత్యేక బృందం విచారిస్తుంది. మరోవైపు ముంబైలోని సిపిఐ హెడ్క్వార్టర్స్ లో సుశాంత్ ఫ్రెండ్ సిద్ధార్థను కూడా సిబిఐ విచారణ చేస్తోంది. వరుసగా ఆరు రోజులపాటు సిద్ధార్థ్ అని సిబిఐ అధికారులు విచారణ చేస్తున్నారు. అదేవిధంగా సుశాంత్ వంటమనిషి నీ కూడా విచారిస్తున్నారు.
ఇదిలా ఉండగా సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి పై మొదటి నుండి విమర్శలు వస్తున్న తరుణంలో తాజాగా ఓ జాతీయ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడి చేసింది. సుశాంత్ సింగ్ కి గంజాయి అలవాటు ఉందని ఆమె తెలిపింది. అతని గురించి ఇలా మాట్లాడాల్సి వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు అని పేర్కొంది. కానీ తనపై వస్తున్న విమర్శలకు కచ్చితంగా మాట్లాడాలి సిందే కాబట్టి ఈ విధంగా మాట్లాడుతున్నా అంటూ…. సుశాంత్ తో యూరప్ ట్రిప్ అయిన తర్వాత నేను…. అతనితోనే ఉంటున్నాను. అంతా ఆయన ఇంట్లోనే…. ఇంతలో అనారోగ్యం పాలయ్యా అని తెలిపింది.
ఆ సమయంలో జూన్ ఎనిమిదో తారీకు అసలు ఏం జరిగింది అంటే, సుశాంత్ తన సిస్టర్ వస్తుంది అంటూ ఇంటి నుండి నన్ను వెళ్ళిపోమని ఒత్తిడి చేశారు. ఈ విషయం గురించి రెండు మూడు రోజులు ఇద్దరి మధ్య గట్టిగా చర్చ జరిగింది. కానీ వాళ్ళ సిస్టర్ ఇంకా రెండు గంటల్లో రాబోతుండగా నన్ను ఇంటి నుండి బలవంతంగా బయటకు పంపించేశాడు. అనారోగ్యంతో నేను ఇంటికి వచ్చాను. ఆ తర్వాత నుండి సుశాంత్ తనకి ఫోన్ చేయలేదు. కానీ తర్వాత మరుసటి రోజు మెసేజ్ చేశాడు. నాకు ఆరోగ్యం బాగా లేదని తెలిసి కూడా ఫోన్ చేయకపోవడంతో…. అతడికి నేను అవసరం లేదు అని అనిపించింది. వెంటనే ఆ రోజు మధ్యాహ్నం నుంచి సుశాంత్ వాట్సాప్ బ్లాక్ చేశాను అని రియా తెలిపింది. ఇందువల్లే సుశాంత్ ఫీల్ అయి ఉండి సూసైడ్ చేసుకుని ఉంటాడేమో అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!