Sarkaru Vaari Paata Review: `గీత గోవిందం` ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు చేసిన తాజా చిత్రం `సర్కారు వారి పాట`. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్గా నటించగా.. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మించారు.
భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన ఓ భారీ కుంభకోణం నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం మే 12న అంటే మరి కొన్ని గంటల్లోనే ప్రేక్షకులను అలరించబోతోంది. అప్పుడే థియేటర్ల వల్ల మహేశ్ బాబు అభిమానులు సందడి కూడా షురూ అయింది. మరోవైపు మేకర్స్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసేందుకు విసృతంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇక తాజాగా `సర్కారు వారి పాట`పై ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడిగా చెప్పుకునే ఉమైర్ సంధు `సర్కారు వారి పాట`పై తనదైన శైలిలో రివ్యూ అండ్ రేటింగ్ ఇచ్చారు. ఇంతకీ ఆయన ఏం చెప్పారంటే..` సర్కారు వారి పాట మాస్ ప్రేక్షకులను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే చిత్రం. యాక్షన్, ఎమోషన్స్, డ్రామా, కామెడీ సమపాళ్లలో కలగలిపి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తెరపై మహేశ్ పెర్ఫార్మన్స్ అద్భుతం. ఆయన నటకు నేను ఫ్యాన్ అయిపోయాను.
కీర్తి సురేష్ గురించి చెప్పాలంటే.. ఆమె లేకపోతే ఈ సినిమా అసంపూర్ణం. తన పాత్రకు కీర్తి వంద శాతం న్యాయం చేసింది. మహేశ్-కీర్తిల కెమిస్ట్రీ బాగా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బీభత్సం సృష్టించడం ఖాయం` అంటూ ఉమైర్ సంధు ఇన్స్టా వేదికగా రాసుకొచ్చారు. అంతేకాదు, ఈ మూవీకి ఏకంగా 4.5/5 రేటింగ్ కూడా ఇచ్చారు. మొత్తానికి ఉమైర్ రివ్యూతో సినిమాపై వేరె లెవల్లో అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాలను మహేశ్ అందుకుంటాడో..లేదో.. తెలియాలంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!