Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేశ్ బాబు, జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ జంటగా నటించిన తాజా చిత్రం `సర్కారు వారి పాట`. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహించారు.
తమన్ స్వరాలు అందించగా.. సముద్రఖని, నదియా, వెన్నెల కిషోర్, సౌమ్య మీనన్, సుబ్బరాజు, అజయ్, బ్రహ్మాజి, తనికెళ్ల భరణి తదితరులు కీలక పాత్రలను పోషించారు. మే 12న వరల్డ్ వైడ్గా విడులైన ఈ చిత్రం మంచి రెస్పాన్స్ను దక్కించుకుంది. దీంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబడుతూ బ్రేక్ ఈవెన్ దిశగా దూసుకుపోతోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇకపోతే యూఎస్లో మహేశ్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెక్కర్లేదు. ఆయన నటించిన ప్రతి సినిమా టాక్తో సంబంధం లేకుండా ఓవర్సీలో సూపర్ కలెక్షన్స్ ను రాబడుతుంటుంది. ఇందుకు `సర్కారు వారి పాట` ఏమీ మినహాయింపు కాదు. ఈ చిత్రం సైతం యూఎస్ లో నయా కలెక్షన్ ని అందుకుంటూ బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది.
సినిమా విడుదలై తొమ్మిది రోజులు అవుతున్నా మహేశ్ అక్కడ అస్సలు తగ్గట్టేదు. తాజాగా ఈ చిత్రం యూఎస్ బాక్సాఫీస్ దగ్గర 2.2 మిలియన్ డాలర్స్ గ్రస్స్ మార్క్ ని క్రాస్ చేసి స్టడీగా కంటిన్యూ అవుతుంది. మొత్తానికి మహేశ్ మరోసారి ఓవర్సీలో తన మజాకా చూపించి అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ కు కాసుల వర్షం కురిపిస్తున్నాడు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!