హీరో సుదీప్ అందరికీ సుపరిచితుడే. దక్షిణాది సినిమా రంగంలో వైవిధ్యమైన పాత్రలు చేస్తూ.. తిరుగులేని క్రేజ్ ఉన్న సుదీప్.. తెలుగులో అప్పట్లో రాజమౌళి దర్శకత్వంలో “ఈగ” సినిమాలో విలన్ పాత్ర చేయడం జరిగింది. ఆ తర్వాత బాహుబలి లో కూడా నటించడం జరిగింది. ఇదిలా ఉంటే సుదీప్ ఇటీవల చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు కాంట్రవర్సీ కావడం తెలిసిందే. కొన్ని నెలల క్రితం హిందీ భాష గురించి సుదీప్.. కాంట్రవర్సీ కామెంట్లు చేశారు. ఆ సమయంలో బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన చాలామంది ఘాటుగా రియాక్ట్ అయ్యారు.
ప్రధాని మోడీ మాటలకు మద్దతనిస్తున్న నటుడు కిచ్చా సుదీప్?
సుదీప్ వ్యాఖ్యలు సౌత్ ఫిలిమ్ ఇండస్ట్రీ వర్సెస్ బాలీవుడ్ ఇండస్ట్రీ అన్నట్టు మారిపోయాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా సుదీప్.. బాలీవుడ్ ఇండస్ట్రీపై కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. భారత్ క్రికెట్ జట్టులో ప్రస్తుతం స్టార్ క్రికెటర్ కోహ్లీ పరిస్థితి బాలీవుడ్ పరిస్థితి ఒకేలా ఉందని అభివర్ణించారు. కోహ్లీ ఫామ్ లో లేకపోవడంతో… ఆశించిన రీతిలో జట్టులో రాణించకపోవడం ప్రస్తుతం భారతీయ క్రికెట్ వర్గాలలో ఆందోళనకరంగా ఉంది.
సరిగ్గా ఇప్పుడు ఇదే దిశగా బాలీవుడ్ ఇండస్ట్రీలో సరైన హిట్ సినిమాలు రావటం లేదని..సుదీప్ తన కొత్త సినిమా “విక్రాంత్ రోనా” ప్రమోషన్ కార్యక్రమాలలో తెలియజేయడం జరిగింది. హిందీలో జరిగిన ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమానికి బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ… అన్ని సినిమాలు విజయం సాధిస్తాయని మొదలు పెడతాం. కొన్ని ఆడతాయి మరికొన్ని ఆడవు.. అంటూ ఇదే కార్యక్రమంలో తనదైన శైలిలో చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా మళ్లీ బాలీవుడ్ ఇండస్ట్రీని ఫాం లో లేని కోహ్లీ తో సుదీప్ పోల్చటం ఇప్పుడు సంచలనంగా మారింది.